ఈ సినిమా కోసం ఇండియన్ ఆర్మీయే యుద్ధ ట్యాంకులు ఇచ్చింది.. బోర్డర్ మూవీ గురించి ఎవరికీ తెలియని 7 విశేషాలు

By Hari Prasad S, Hyderabad
Published on Jan 22, 2026 10:04 pm IST

బోర్డర్ మూవీ వచ్చి 28 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులు ఈ మూవీతో భావోద్వేగంగా ముడిపడి ఉన్నారు. ఇప్పుడు బోర్డర్ 2 రూపంలో సీక్వెల్ వస్తున్న నేపథ్యంలో ఆ మూవీ గురించి ఎవరికీ తెలియని ఏడు విశేషాల గురించి ఇక్కడ చూడండి.

1 / 8
<p>సన్నీ డియోల్ నటించిన బోర్డర్ 2 సినిమా చూడటానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. 1997లో వచ్చిన మొదటి భాగం బోర్డర్ 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించారు. రెండవ భాగం కూడా 1971 యుద్ధం నాటి మరో కోణాన్ని కథగా తీసుకొని రూపొందించారు. మొదటి భాగం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 pm IST

సన్నీ డియోల్ నటించిన బోర్డర్ 2 సినిమా చూడటానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. 1997లో వచ్చిన మొదటి భాగం బోర్డర్ 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించారు. రెండవ భాగం కూడా 1971 యుద్ధం నాటి మరో కోణాన్ని కథగా తీసుకొని రూపొందించారు. మొదటి భాగం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.

2 / 8
<p>బోర్డర్ మూవీ జేపీ దత్తా డ్రీమ్ ప్రాజెక్ట్. దివంగత సోదరుడు దీపక్ దత్తా జ్ఞాపకార్థం ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపక్ భారత వైమానిక దళ పైలట్. అతను 1987లో విమాన ప్రమాదంలో మరణించాడు. తన డైరీ జ్ఞాపకాల ఆధారంగా జెపి దత్తా ఈ చిత్రాన్ని రాశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 pm IST

బోర్డర్ మూవీ జేపీ దత్తా డ్రీమ్ ప్రాజెక్ట్. దివంగత సోదరుడు దీపక్ దత్తా జ్ఞాపకార్థం ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపక్ భారత వైమానిక దళ పైలట్. అతను 1987లో విమాన ప్రమాదంలో మరణించాడు. తన డైరీ జ్ఞాపకాల ఆధారంగా జెపి దత్తా ఈ చిత్రాన్ని రాశారు.

3 / 8
బోర్డర్ మూవీలో చూపించిన వాహనాలు, ఆయుధాలు భారత సైన్యం, వైమానిక దళం నుంచి తీసుకున్నారు. ఇందులో మిగ్-21, ఆర్మీ జీపులు, హాకర్ హంటర్ విమానాలు, టి-55 ట్యాంకులు, మందుగుండు సామగ్రి ఉన్నాయి. expand-icon View Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 pm IST

బోర్డర్ మూవీలో చూపించిన వాహనాలు, ఆయుధాలు భారత సైన్యం, వైమానిక దళం నుంచి తీసుకున్నారు. ఇందులో మిగ్-21, ఆర్మీ జీపులు, హాకర్ హంటర్ విమానాలు, టి-55 ట్యాంకులు, మందుగుండు సామగ్రి ఉన్నాయి.

4 / 8
<p>ఈ చిత్రాన్ని రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరించారు. ఇది 1971 యుద్ధం జరిగిన ప్రదేశాలలోనే తీయడం విశేషం.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 pm IST

ఈ చిత్రాన్ని రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరించారు. ఇది 1971 యుద్ధం జరిగిన ప్రదేశాలలోనే తీయడం విశేషం.

5 / 8
<p>సునీల్ శెట్టి బోర్డర్ చిత్రంలో భైరవ్ సింగ్ పాత్రలో నటించారు. ఆయన పాత్ర బీఎస్ఎఫ్ జవాన్ భైరవ్ సింగ్ రాథోడ్ నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమా విడుదలయ్యే సమయంలో ఆయన బతికే ఉన్నాడు. భైరవ్ సింగ్ 2022లో 81 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. కానీ సినిమాలో మాత్రం భైరవ్ పాత్ర కన్నుమూస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 pm IST

సునీల్ శెట్టి బోర్డర్ చిత్రంలో భైరవ్ సింగ్ పాత్రలో నటించారు. ఆయన పాత్ర బీఎస్ఎఫ్ జవాన్ భైరవ్ సింగ్ రాథోడ్ నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమా విడుదలయ్యే సమయంలో ఆయన బతికే ఉన్నాడు. భైరవ్ సింగ్ 2022లో 81 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. కానీ సినిమాలో మాత్రం భైరవ్ పాత్ర కన్నుమూస్తుంది.

6 / 8
<p>జేపీ దత్తా క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారు. ఈ బోర్డర్ మూవీలో చాలా మంది సైనికులను చూపించగా.. లోంగేవాలా అసలైన యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే అమరులయ్యారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 pm IST

జేపీ దత్తా క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారు. ఈ బోర్డర్ మూవీలో చాలా మంది సైనికులను చూపించగా.. లోంగేవాలా అసలైన యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే అమరులయ్యారు.

7 / 8
<p>ఈ సినిమా విడుదలకు ముందే జేపీ దత్తాకు హత్య బెదిరింపులు రావడం మొదలైంది. అతను సుమారు 3-4 నెలల పాటు ఇద్దరు బాడీగార్డులను వెంటబెట్టుకొని తిరగాల్సి వచ్చింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 pm IST

ఈ సినిమా విడుదలకు ముందే జేపీ దత్తాకు హత్య బెదిరింపులు రావడం మొదలైంది. అతను సుమారు 3-4 నెలల పాటు ఇద్దరు బాడీగార్డులను వెంటబెట్టుకొని తిరగాల్సి వచ్చింది.

8 / 8
<p>బోర్డర్ 1997లో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అయితే దిల్ తో పాగల్ హై సినిమా ముందంజలో ఉండగా, బోర్డర్ రెండో స్థానంలో నిలిచింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jan 22, 2026 10:04 pm IST

బోర్డర్ 1997లో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అయితే దిల్ తో పాగల్ హై సినిమా ముందంజలో ఉండగా, బోర్డర్ రెండో స్థానంలో నిలిచింది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!