ఈ సినిమా కోసం ఇండియన్ ఆర్మీయే యుద్ధ ట్యాంకులు ఇచ్చింది.. బోర్డర్ మూవీ గురించి ఎవరికీ తెలియని 7 విశేషాలు
బోర్డర్ మూవీ వచ్చి 28 ఏళ్లు దాటినా ఇప్పటికీ ప్రేక్షకులు ఈ మూవీతో భావోద్వేగంగా ముడిపడి ఉన్నారు. ఇప్పుడు బోర్డర్ 2 రూపంలో సీక్వెల్ వస్తున్న నేపథ్యంలో ఆ మూవీ గురించి ఎవరికీ తెలియని ఏడు విశేషాల గురించి ఇక్కడ చూడండి.
సన్నీ డియోల్ నటించిన బోర్డర్ 2 సినిమా చూడటానికి ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. 1997లో వచ్చిన మొదటి భాగం బోర్డర్ 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించారు. రెండవ భాగం కూడా 1971 యుద్ధం నాటి మరో కోణాన్ని కథగా తీసుకొని రూపొందించారు. మొదటి భాగం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీనికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ చూడండి.
బోర్డర్ మూవీ జేపీ దత్తా డ్రీమ్ ప్రాజెక్ట్. దివంగత సోదరుడు దీపక్ దత్తా జ్ఞాపకార్థం ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపక్ భారత వైమానిక దళ పైలట్. అతను 1987లో విమాన ప్రమాదంలో మరణించాడు. తన డైరీ జ్ఞాపకాల ఆధారంగా జెపి దత్తా ఈ చిత్రాన్ని రాశారు.
బోర్డర్ మూవీలో చూపించిన వాహనాలు, ఆయుధాలు భారత సైన్యం, వైమానిక దళం నుంచి తీసుకున్నారు. ఇందులో మిగ్-21, ఆర్మీ జీపులు, హాకర్ హంటర్ విమానాలు, టి-55 ట్యాంకులు, మందుగుండు సామగ్రి ఉన్నాయి.
ఈ చిత్రాన్ని రాజస్థాన్ లోని థార్ ఎడారిలో చిత్రీకరించారు. ఇది 1971 యుద్ధం జరిగిన ప్రదేశాలలోనే తీయడం విశేషం.
సునీల్ శెట్టి బోర్డర్ చిత్రంలో భైరవ్ సింగ్ పాత్రలో నటించారు. ఆయన పాత్ర బీఎస్ఎఫ్ జవాన్ భైరవ్ సింగ్ రాథోడ్ నుండి ప్రేరణ పొందింది. ఈ సినిమా విడుదలయ్యే సమయంలో ఆయన బతికే ఉన్నాడు. భైరవ్ సింగ్ 2022లో 81 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. కానీ సినిమాలో మాత్రం భైరవ్ పాత్ర కన్నుమూస్తుంది.
జేపీ దత్తా క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నారు. ఈ బోర్డర్ మూవీలో చాలా మంది సైనికులను చూపించగా.. లోంగేవాలా అసలైన యుద్ధంలో కేవలం ఇద్దరు సైనికులు మాత్రమే అమరులయ్యారు.
ఈ సినిమా విడుదలకు ముందే జేపీ దత్తాకు హత్య బెదిరింపులు రావడం మొదలైంది. అతను సుమారు 3-4 నెలల పాటు ఇద్దరు బాడీగార్డులను వెంటబెట్టుకొని తిరగాల్సి వచ్చింది.
బోర్డర్ 1997లో దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో అయితే దిల్ తో పాగల్ హై సినిమా ముందంజలో ఉండగా, బోర్డర్ రెండో స్థానంలో నిలిచింది.
E-Paper

