కొత్త బట్టలను ఉతకకుండా ధరించడం వల్ల స్కిన్ అలెర్జీలు వస్తాయా?

Published on Jul 06, 2026 08:17 pm IST

చాలా మంది కొత్త బట్టలను కొన్నప్పుడు ఉన్నవి ఉన్నట్లుగానే వేసుకుంటారు. వాటిని ఉతకరు. కొత్త బట్టలను ఉతకకుండా వేసుకోవడం వల్ల చర్మ అలెర్జీల వంటి సమస్యలు తలెత్తుతాయా?

1 / 5
<p>కొత్తగా కొన్న బట్టలను వెంటనే ధరించడంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. కానీ మనం ఒక కీలకమైన వాస్తవాన్ని విస్మరిస్తాం. ఈ బట్టలు కనిపించినంత శుభ్రంగా ఉండవు. ఫ్యాక్టరీ నుండి షాప్ చేరే వరకు అవి అనేక ప్రక్రియలు, చేతుల గుండా వెళ్తాయి. ఈ క్రమంలో వాటికి రసాయనాలు, మురికి అంటుకునే అవకాశం ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2026 08:17 pm IST

కొత్తగా కొన్న బట్టలను వెంటనే ధరించడంలో ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. కానీ మనం ఒక కీలకమైన వాస్తవాన్ని విస్మరిస్తాం. ఈ బట్టలు కనిపించినంత శుభ్రంగా ఉండవు. ఫ్యాక్టరీ నుండి షాప్ చేరే వరకు అవి అనేక ప్రక్రియలు, చేతుల గుండా వెళ్తాయి. ఈ క్రమంలో వాటికి రసాయనాలు, మురికి అంటుకునే అవకాశం ఉంది.

2 / 5
<p>రవాణా, బట్టల షాపులో చూపించడానికి వస్త్రాలు మంచి స్థితిలో ఉండేలా చూసుకోవడానికి, తయారీ ప్రక్రియలో వాటికి రంగులు, రసాయనాలు, వివిధ రకాల శుద్ధి ప్రక్రియలను ఫాలో అవుతారు. మీరు వస్త్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈ రసాయనాలు దానిపై ఉండిపోవచ్చు. అందువల్ల వాటిని మొదటిసారి ధరించే ముందు ఉతకడం మంచిది. ప్రయాణంలో వాటిపై దుమ్ము, బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాలు పేరుకుపోవచ్చు. ఒక దుకాణంలో కూడా, చాలా మంది బట్టలు వేసుకుని చూడవచ్చు, దీనివల్ల బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు వాటిపై మిగిలిపోయే అవకాశం ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2026 08:17 pm IST

రవాణా, బట్టల షాపులో చూపించడానికి వస్త్రాలు మంచి స్థితిలో ఉండేలా చూసుకోవడానికి, తయారీ ప్రక్రియలో వాటికి రంగులు, రసాయనాలు, వివిధ రకాల శుద్ధి ప్రక్రియలను ఫాలో అవుతారు. మీరు వస్త్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత కూడా ఈ రసాయనాలు దానిపై ఉండిపోవచ్చు. అందువల్ల వాటిని మొదటిసారి ధరించే ముందు ఉతకడం మంచిది. ప్రయాణంలో వాటిపై దుమ్ము, బ్యాక్టీరియా, ఇతర కాలుష్య కారకాలు పేరుకుపోవచ్చు. ఒక దుకాణంలో కూడా, చాలా మంది బట్టలు వేసుకుని చూడవచ్చు, దీనివల్ల బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాలు వాటిపై మిగిలిపోయే అవకాశం ఉంటుంది.

3 / 5
<p>కొత్త బట్టలను ఉతకకుండా ధరించడం వల్ల కొన్నిసార్లు చర్మ ప్రతిచర్యలు కలగవచ్చు. ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా అలెర్జీలు ఉన్నవారిలో అలా ఎక్కువగా ఉంటుంది. తయారీ, ప్యాకేజింగ్, రవాణా, స్టోర్ నిర్వహణ సమయంలో పేరుకుపోయే రసాయనాలు, స్వల్ప పరిమాణంలో ఉండే దుమ్ము, ధూళి లేదా ఇతర పదార్థాలు చర్మానికి చికాకు కలిగించి దురద, ఎరుపు, దద్దుర్లు లేదా అలెర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్‌కు కారణం కావచ్చు. బిగుతుగా ఉండే దుస్తులు లేదా సింథటిక్ ఫ్యాబ్రిక్‌లు చర్మంపై వేడిని, చెమటను బంధించడం ద్వారా చికాకును మరింత తీవ్రతరం చేస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2026 08:17 pm IST

కొత్త బట్టలను ఉతకకుండా ధరించడం వల్ల కొన్నిసార్లు చర్మ ప్రతిచర్యలు కలగవచ్చు. ముఖ్యంగా సున్నితమైన చర్మం లేదా అలెర్జీలు ఉన్నవారిలో అలా ఎక్కువగా ఉంటుంది. తయారీ, ప్యాకేజింగ్, రవాణా, స్టోర్ నిర్వహణ సమయంలో పేరుకుపోయే రసాయనాలు, స్వల్ప పరిమాణంలో ఉండే దుమ్ము, ధూళి లేదా ఇతర పదార్థాలు చర్మానికి చికాకు కలిగించి దురద, ఎరుపు, దద్దుర్లు లేదా అలెర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్‌కు కారణం కావచ్చు. బిగుతుగా ఉండే దుస్తులు లేదా సింథటిక్ ఫ్యాబ్రిక్‌లు చర్మంపై వేడిని, చెమటను బంధించడం ద్వారా చికాకును మరింత తీవ్రతరం చేస్తాయి.

4 / 5
<p>వివిధ నివేదికల ప్రకారం, ఫార్మాల్డిహైడ్ (బట్టలు కుంచించుకుపోకుండా నిరోధించడానికి వాడేది) లేదా స్టార్చ్ (బట్టలకు గట్టిదనాన్ని ఇచ్చి, ఆకారాన్ని నిలబెట్టడానికి వాడేది) వంటి కొన్ని రసాయనాలు చర్మంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ పదార్థాలు, ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులలో, అలెర్జీలు, దురద లేదా చికాకును కలిగించవచ్చు. కేవలం పరిశుభ్రత మాత్రమే కాకుండా బట్టలు ఉతకడం వల్ల వాటి ఫిట్, సౌకర్యం మెరుగుపడతాయి. ఫ్యాక్టరీలలో తయారీ సమయంలో వస్త్రాలను తరచుగా సాగదీసి, గట్టిగా పట్టుకుంటారు. దీనివల్ల అవి ఇంకా వాటి నిజమైన, సహజమైన ఆకృతిలోకి రావు. మొదటిసారి ఉతికిన తర్వాత, వస్త్రం దాని సహజ ఆకృతిలోకి వస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2026 08:17 pm IST

వివిధ నివేదికల ప్రకారం, ఫార్మాల్డిహైడ్ (బట్టలు కుంచించుకుపోకుండా నిరోధించడానికి వాడేది) లేదా స్టార్చ్ (బట్టలకు గట్టిదనాన్ని ఇచ్చి, ఆకారాన్ని నిలబెట్టడానికి వాడేది) వంటి కొన్ని రసాయనాలు చర్మంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఈ పదార్థాలు, ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్న వ్యక్తులలో, అలెర్జీలు, దురద లేదా చికాకును కలిగించవచ్చు. కేవలం పరిశుభ్రత మాత్రమే కాకుండా బట్టలు ఉతకడం వల్ల వాటి ఫిట్, సౌకర్యం మెరుగుపడతాయి. ఫ్యాక్టరీలలో తయారీ సమయంలో వస్త్రాలను తరచుగా సాగదీసి, గట్టిగా పట్టుకుంటారు. దీనివల్ల అవి ఇంకా వాటి నిజమైన, సహజమైన ఆకృతిలోకి రావు. మొదటిసారి ఉతికిన తర్వాత, వస్త్రం దాని సహజ ఆకృతిలోకి వస్తుంది.

5 / 5
<p>కొత్త బట్టలను వేసుకునే ముందు ఉతకడం వల్ల వాటిపై ఉండే అనేక మలినాలు తొలగిపోతాయి. చర్మపు చికాకు, అలెర్జీ ప్రతిచర్యల ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా శిశువులు, పిల్లలు, సున్నితమైన చర్మం ఉన్నవారికి, సువాసన లేని తేలికపాటి డిటర్జెంట్‌ను ఉపయోగించడం ఒక మంచి ఎంపిక. ఒకవేళ కొన్ని బట్టలు వేసుకున్న తర్వాత మీకు నిరంతర దురద, వాపు, బొబ్బలు లేదా దద్దుర్లు కనిపిస్తే, వాటిని వాడటం ఆపివేసి, సరైన పరీక్ష, చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 06, 2026 08:17 pm IST

కొత్త బట్టలను వేసుకునే ముందు ఉతకడం వల్ల వాటిపై ఉండే అనేక మలినాలు తొలగిపోతాయి. చర్మపు చికాకు, అలెర్జీ ప్రతిచర్యల ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా శిశువులు, పిల్లలు, సున్నితమైన చర్మం ఉన్నవారికి, సువాసన లేని తేలికపాటి డిటర్జెంట్‌ను ఉపయోగించడం ఒక మంచి ఎంపిక. ఒకవేళ కొన్ని బట్టలు వేసుకున్న తర్వాత మీకు నిరంతర దురద, వాపు, బొబ్బలు లేదా దద్దుర్లు కనిపిస్తే, వాటిని వాడటం ఆపివేసి, సరైన పరీక్ష, చికిత్స కోసం చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!