టీచర్ అభ్యర్థులకు అలర్ట్ - 'సీటెట్ 2026' నోటిఫికేషన్ విడుదల, ఎగ్జామ్ ఎప్పుడంటే..?
టీచర్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ -టెట్) నోటిఫికేషన్ వచ్చేసింది. సీబీఎస్ఈ ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరి 8వ తేదీన ఈ ఎగ్జామ్ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు.
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీ -టెట్) నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ మేరకు సీబీఎస్ఈ బోర్డు వివరాలను పేర్కొంది. ఇందుకు సంబంధించిన పరీక్షను 2026 ఫిబ్రవరి 8వ తేదీన నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా 132 నగరాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు Paper- I, Paper-II రాయాల్సి ఉంటుంది. మొత్తం 22 భాషాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బులెటిన్ ను CTET అధికారిక వెబ్ సైట్ https://ctet.nic.in లో చూడొచ్చు. ఇందులో సిలబస్ వివరాలను కూడా పొందుపరుస్తారు.
అర్హులైన అభ్యర్థులు https://ctet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. నిర్ణయించిన ఫీజును కూడా చెల్లించుకోవచ్చు. పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా ఇందులో నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. త్వరలోనే ఈ వివరాలన్నీ వెబ్ సైట్ లో అప్డేట్ అవుతాయి.
సీటెట్ క్వాలిఫై అయితే… దేశవ్యాప్తంగానూ టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో టీచర్ గా పని చేసేందుకు సీటెట్ అవసరం. రాష్ట్రాల్లో కూడా టెట్ పరీక్ష పాస్ కావటం తప్పనిసరి కాబట్టి… సీటెట్ రాసేందుకు చాాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు.
సీటెట్ పేపర్-1లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు. పేపర్ -2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను 6 నుంచి 8వ తరగతి వరకు ఉపాధ్యాయ నియామకానికి అర్హులుగా పరిగణిస్తారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయం, నవోదయ విద్యాలయ, ఆర్మీ స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
సీటెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థి కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగిరీకి 150 మార్కులకు గాను కనీసం 90 మార్కులు (60 శాతం), ఎస్సీ, ఎస్టీలకు 150 మార్కులకు 82 మార్కులు (55 శాతం) రావాలి. సీటెట్ పరీక్ష స్కోర్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది.
సీటెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే అభ్యర్థి కనీస అర్హత మార్కులు సాధించాలి. జనరల్ కేటగిరీకి 150 మార్కులకు గాను కనీసం 90 మార్కులు (60 శాతం), ఎస్సీ, ఎస్టీలకు 150 మార్కులకు 82 మార్కులు (55 శాతం) రావాలి. సీటెట్ పరీక్ష స్కోర్ కార్డు జీవితాంతం చెల్లుబాటు అవుతుంది.
E-Paper

