రూ. 4,999కే 50ఎంపీ డ్యూయెల్ కెమెరా స్మార్ట్ఫోన్! 5000ఎంఏహెచ్ బ్యాటరీ కూడా..
అతి తక్కువ బడ్జెట్లో మంచి స్మార్ట్ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీరు Ai+ Pulse స్మార్ట్ఫోన్ గురించి తెలుసుకోవాల్సిందే! ఈ గ్యాడ్జెట్ వివరాలను ఇక్కడ చూసేయండి..
ఈ ఏఐ+ పల్స్ స్మార్ట్ఫోన్లో 6.7 ఇంచ్ టీఎఫ్టీ ఐపీఎస్ పెద్ద స్క్రీన్ ఉంటుంది. 720x1600 పిక్సెల్స్ హెచ్డీ+ తో ఇది వస్తుంది. 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్ దీని సొంతం.
ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్లో హైలైట్ ఫీచర్.. దాని కెమెరా అని చెప్పుకోవాలి! ఇందులో 50ఎంపీ+2ఎంపీ రేర్ కెమెర్ సెటప్ ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ ఫ్రెంట్ కెమెరాని ఇచ్చింది సంస్థ. వీటితో ఫుల్ హెచ్డీ వీడియోలను రికార్డు చేసుకోవచ్చు.
ఇక ఈ ఏఐ+ పల్స్ స్మార్ట్ఫోన్లో ఆక్టా కోర్ యూనీఎస్ఓసీ టీ615 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 4జీబీ ర్యామ్/ 6జీబీ ర్యామ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. 1టీబీ వరకు ఎక్స్ప్యాండెబుల్ స్టోరేజ్ లభిస్తుండటం విశేషం.
ఈ స్మార్ట్ఫోన్లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తోంది. టైప్-సీ పోర్ట్తో వస్తోంది. ఇది 5జీ మొబైల్ కాదు. ఇదొక 4జీ గ్యాడ్జెట్. ఈ ఏఐ+ పల్స్ వాస్తవ ధర రూ. 7,999. కాగా ఫ్లిప్కార్ట్లో ప్రస్తుతం ఇది రూ. 4,999కే అందుబాటులోకి వచ్చింది. మరిన్ని వివరాల కోసం ఫ్లిప్కార్ట్లో ఏఐ+ పల్స్ని సెర్చ్ చేయండి.
E-Paper

