In Pics : మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

Updated On Jan 19, 2026 12:04 pm IST

మేడారంలో గద్దెలు, ఆలయం ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పున:ప్రారంభించారు. అనంతరం కుటుంబంతో కలిసి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1 / 6
<p>మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని పున:ప్రారంభించారు. కుటుంబంతో కలిసి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jan 19, 2026 12:04 pm IST

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని పున:ప్రారంభించారు. కుటుంబంతో కలిసి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

2 / 6
<p>మేడారంలో మనవడితో కలిసి నిలువత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు సీఎం రేవంత్. గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jan 19, 2026 12:04 pm IST

మేడారంలో మనవడితో కలిసి నిలువత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు సీఎం రేవంత్. గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు.

3 / 6
<p>మేడారంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jan 19, 2026 12:04 pm IST

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

4 / 6
<p>ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప - లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు చెప్పారు. అలాగే ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల - తిరుపతి, కుంభమేళాలను తలపించేలా ప్రతినిత్యం భక్తులు సందర్శించే విధంగా మేడారం ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jan 19, 2026 12:04 pm IST

ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప - లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు చెప్పారు. అలాగే ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల - తిరుపతి, కుంభమేళాలను తలపించేలా ప్రతినిత్యం భక్తులు సందర్శించే విధంగా మేడారం ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.

5 / 6
<p>ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గుడి లేని తల్లులను గుండెనిండా నింపుకొని జరుపుకొనే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయన్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jan 19, 2026 12:04 pm IST

ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గుడి లేని తల్లులను గుండెనిండా నింపుకొని జరుపుకొనే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయన్నారు.

6 / 6
<p>మేడారం ఆలయ పునరుద్ధరణ చేపట్టడం తనకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భమని రేవంత్ రెడ్డి అన్నారు. జీవితకాలంలో ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పని చేశామా అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సంతృప్తినిచ్చే ఘట్టం ఇది అన్నారు. జీవితాంతం గుర్తుండిపోయే అరుదైన అవకాశం అని చెప్పారు.</p> expand-icon View Photos in a new improved layout
Updated on Jan 19, 2026 12:04 pm IST

మేడారం ఆలయ పునరుద్ధరణ చేపట్టడం తనకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భమని రేవంత్ రెడ్డి అన్నారు. జీవితకాలంలో ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పని చేశామా అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సంతృప్తినిచ్చే ఘట్టం ఇది అన్నారు. జీవితాంతం గుర్తుండిపోయే అరుదైన అవకాశం అని చెప్పారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!