In Pics : మేడారంలో నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో గద్దెలు, ఆలయం ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి పున:ప్రారంభించారు. అనంతరం కుటుంబంతో కలిసి వనదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి గద్దెలు, ఆలయ ప్రాంగణాన్ని పున:ప్రారంభించారు. కుటుంబంతో కలిసి సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మేడారంలో మనవడితో కలిసి నిలువత్తు బంగారాన్ని సమర్పించుకున్నారు సీఎం రేవంత్. గద్దెల ప్రాంగణంలో పైలాన్ను ఆవిష్కరించారు.
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటుగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం పుణ్యక్షేత్రం.. జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప - లక్నవరం నుంచి పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతకుముందు చెప్పారు. అలాగే ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల - తిరుపతి, కుంభమేళాలను తలపించేలా ప్రతినిత్యం భక్తులు సందర్శించే విధంగా మేడారం ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం మేడారం మహోత్సవం అని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. గుడి లేని తల్లులను గుండెనిండా నింపుకొని జరుపుకొనే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయన్నారు.
మేడారం ఆలయ పునరుద్ధరణ చేపట్టడం తనకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భమని రేవంత్ రెడ్డి అన్నారు. జీవితకాలంలో ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పని చేశామా అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సంతృప్తినిచ్చే ఘట్టం ఇది అన్నారు. జీవితాంతం గుర్తుండిపోయే అరుదైన అవకాశం అని చెప్పారు.
E-Paper

