వరంగల్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన - ఆర్థిక సాయంపై ప్రకటన
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు. ఆ తర్వాత వరంగల్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధిత కుటుంబాలకు రూ. 15 వేలు ఇచ్చే అంశంపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏరియల్ సర్వే చేశారు. పంట నష్టంపై ఆరా తీశారు.
అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. సమ్మయ్యనగర్లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు.
వరద బాధితులతో సీఎం రేవంత్ మాట్లాడారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. తన పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి….. వరదల వల్ల ఇళ్లు కోల్పయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులు కూడా వచ్చాయని… వాటిని సమగ్రంగా వినియోగించుకోవాలన్నారు. డ్రైనేజీ పనుల విషయంపై సమగ్రమైన విధానం రూపొందించాలని సూచించారు.
ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని… రివ్యూ నిర్వహించిన రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. అధికారులు ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నారు. కొన్ని శాఖల మధ్య సమన్వయం లేకపోవటంపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వరద వచ్చి ఆస్టి నష్టం జరిగిన కుటుంబాలకు రూ. 15 వేలు ఇవ్వాలని సూచించారు. వెంటనే బాధితులను గుర్తించి… నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
E-Paper

