వరంగల్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన - ఆర్థిక సాయంపై ప్రకటన

Published on Oct 31, 2025 05:34 pm IST

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు. ఆ తర్వాత వరంగల్ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధిత కుటుంబాలకు రూ. 15 వేలు ఇచ్చే అంశంపై కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

1 / 5
<p>తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 05:34 pm IST

తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతాలను వీక్షించారు.

2 / 5
<p>మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏరియల్‌ సర్వే చేశారు. పంట నష్టంపై ఆరా తీశారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 05:34 pm IST

మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఏరియల్‌ సర్వే చేశారు. పంట నష్టంపై ఆరా తీశారు.

3 / 5
<p>అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. సమ్మయ్యనగర్‌లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 05:34 pm IST

అనంతరం హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. సమ్మయ్యనగర్‌లో వరద ప్రాంతాలను, దెబ్బతిన్న నాలాలను పరిశీలించారు.

4 / 5
<p>వరద బాధితులతో సీఎం రేవంత్ మాట్లాడారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. తన పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి….. వరదల వల్ల ఇళ్లు కోల్పయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులు కూడా వచ్చాయని… వాటిని సమగ్రంగా వినియోగించుకోవాలన్నారు. డ్రైనేజీ పనుల విషయంపై సమగ్రమైన విధానం రూపొందించాలని సూచించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 05:34 pm IST

వరద బాధితులతో సీఎం రేవంత్ మాట్లాడారు. అన్ని విధాలా ఆదుకుంటామని హామీనిచ్చారు. తన పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి….. వరదల వల్ల ఇళ్లు కోల్పయిన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించే అంశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులు కూడా వచ్చాయని… వాటిని సమగ్రంగా వినియోగించుకోవాలన్నారు. డ్రైనేజీ పనుల విషయంపై సమగ్రమైన విధానం రూపొందించాలని సూచించారు.

5 / 5
<p>ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని… రివ్యూ నిర్వహించిన రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. అధికారులు ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నారు. కొన్ని శాఖల మధ్య సమన్వయం లేకపోవటంపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వరద వచ్చి ఆస్టి నష్టం జరిగిన కుటుంబాలకు రూ. 15 వేలు ఇవ్వాలని సూచించారు. వెంటనే బాధితులను గుర్తించి… నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 05:34 pm IST

ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని… రివ్యూ నిర్వహించిన రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. అధికారులు ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిందేని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలన్నారు. కొన్ని శాఖల మధ్య సమన్వయం లేకపోవటంపై సీఎం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్లలోకి వరద వచ్చి ఆస్టి నష్టం జరిగిన కుటుంబాలకు రూ. 15 వేలు ఇవ్వాలని సూచించారు. వెంటనే బాధితులను గుర్తించి… నష్ట పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!