ఎటు చూసినా వరద నీళ్లే... ఓరుగల్లులో జన జీవనం అస్తవ్యస్తం - ఈ ఫొటోలు చూడండి
మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరగంల్ జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజులుగా కురుసిన భారీ వర్షాలకు వరంగల్, హన్మకొండలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. వరద బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరగంల్ జిల్లా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండు రోజులుగా కురుసిన భారీ వర్షాలకు వరంగల్, హన్మకొండలోని చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఇండ్లు, బంగ్లాలపై చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. మంచి నీటిని కూడా ఇదే మాదిరిగా పంపిస్తున్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం దాటికి వరంగల్ నగరంలోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.
వరంగల్ పరిధిలోని ఎన్ఎన్ నగర్, బీఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిని బోట్లు, లైఫ్ జాకెట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
వరద ముంపు ప్రాంత బాధితులను మంత్రి కొండా సురేఖతో పాటు జిల్లా కలెకర్ట్ పరామర్శించారు. కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని… ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి సురేఖ భరోసానిచ్చారు.
వడ్డేపల్లి చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో పలు కాలనీలు మునిగిపోయాయి. కార్లు, బైకులు కూడా నీటిలోనే ఉండిపోయాయి.
సహాయక బృందాలు ఎప్పటికప్పుడు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
జలదిగ్బంధంలో చిక్కుకున్న బీఆర్నగర్
E-Paper

