Telangana Temperatures : తెలంగాణలో భానుడి భగభగలు - ములుగులో రికార్డు ఉష్ణోగ్రత నమోదు...!
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలుచోట్ల 35 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఇవాళ పలుచోట్ల 35 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఇవాళ ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఆదిలాబాద్, జగిత్యాల, ఖమ్మంలో 38.9 డిగ్రీలు, మంచిర్యాలలో 38.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.
ఇవాళ హైదరాబాద్ సిటీలోనూ ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. చాలా ప్రాంతాల్లో 35 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరో 3 - 4 రోజులపాటు కూడా ఇదే మాదిరి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాబోయే రోజుల్లోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను తాకే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రత సాధారణంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కానున్నాయి
(image source Pixabay)
E-Paper

