డిప్యూటీ సీఎం ‘ఆన్ డ్యూటీ’ - కాలినడకన దట్టమైన అడవిలో పవన్ పర్యటన, ఈ ఫొటోలు చూడండి
తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గోడౌన్ ను డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు.మండూరు అటవీ ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించారు.
తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గోడౌన్ ను డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు.
8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలపై ఆరా తీశారు.
ప్రతి గోడౌన్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రికార్డులు పరిశీలించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అటవీశాఖ అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణించిన ఆయన… రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టును పరిశీలించారు.
ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కలను పరిశీలించిన పవన్ కల్యాణ్…. అటవీ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతం మొత్తం పరిశీలించారు.
వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలను డిప్యూటీ సీఎం పవన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని, పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ వంటి అంశాలపై ఆరా తీశారు.
ఎర్రచందనం దుంగలను పట్టుకొని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఎర్రచందనం నిల్వ చేసిన గోడౌన్ లో పవన్ కల్యాణ
అటవీశాఖ అధికారులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్
E-Paper

