సంక్రాంతి మహోత్సవాలు 2026 : నా గుండెల్లో పిఠాపురం ఉంటుంది - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత కళలు గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఫొటోలపై ఓ లుక్కేయండి….
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత కళలు గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.
ఆదివాసీ మహిళలతో కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపు స్టెప్పులు వేశారు.
చేతితో నూలు వడకడానికి ఉపయోగించే రాట్నంతో ఏర్పాటు చేసిన స్టాల్ ను పవన్ కల్యాణ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్… తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రజల ప్రేమను తీసుకెళ్లండంటూ పిలుపునిచ్చారు.
“పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా పెద్ద వార్త అయిపోతుంది, తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు గమనించాలి. ఇతర ఏ ప్రముఖ నాయకుల నియోజకవర్గాల్లో ఇలా జరగదు. గత ప్రభుత్వ హాయంలో పిఠాపురం నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కేటాయించి పనులు చేశారో చూడండి, నేను పిఠాపురం MLA గా గెలిచాక కేవలం తొలి సంవత్సరంలో ₹308 కోట్లు కేటాయించి ఈ మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేసేలా అభివృద్ధి చేపట్టాము. ఇది ప్రజలు గమనించాలి" అని పవన్ కల్యాణ్ కోరారు.
“నాకు ఇక్కడ ఉండటం కంటే కూడా, నేను లేకపోయినా మీ పనులు పూర్తయ్యే వ్యవస్థ ఏర్పాటు చేయడం ముఖ్యం. నేను ఉంటేనే, నన్ను కలిస్తేనే పనులు అవుతాయి అంటే అది పరిపాలన వైఫల్యంగా నేను భావిస్తాను. ఈరోజు పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థ పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాము.నేను పిఠాపురం నుండి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నాను. పిఠాపురం వరకు పరిమితం చేయకండి. నేను పేరంటాలకు, ఫంక్షన్లకు అటెండ్ కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను.నేను ఎక్కడా ఉన్నా నా గుండెల్లో పిఠాపురం ఉంటుంది అనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోండి” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, గోవా, తమిళనాడు, ఒరిస్సా, బెంగాల్ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతుంటే కేవలం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్ తీసుకురాగలిగాం అంటే అని నాకు పిఠాపురం ప్రజలపై, ఉప్పాడ ప్రజలపైనున్న ప్రేమ" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
“పీఠికాపురం సంక్రాంతి పండుగకు వేడుక కావాలి. మతాలకు అతీతంగా అందరూ కేరళ ఓనం పండుగ తరహాలో జరుపుకోవాలి. ఈ వారసత్వాన్ని భావితరానికి అందించాలి అని కోరుకుంటున్నాను” అని పవన్ కల్యాణ్ చెప్పారు.
E-Paper

