కొనసాగుతున్న 'సికింద్రాబాద్ రైల్వే స్టేషన్' అభివృద్ధి పనులు - ఈ ఫొటోలు చూడండి
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు 46 శాతం పనులు పూర్తయ్యాయి. తాజా ఫొటోలు ఇక్కడ చూడండి…..
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రపంచస్థాయి ఆధునిక సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తైతే... రైల్వే నెట్వర్క్ మరింత బలపడటంతో పాటు, ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది.
ఇందులో భాగంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టారు. రైల్వేశాఖ రూపొందించిన డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ. 714.73 కోట్లు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా విడుదల వివరాల ప్రకారం… ఇప్పటివరకు 46 శాతం పనులు పూర్తయ్యాయి. త్వరలో నే అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ప్రస్తుతం సౌత్ బేస్మెంట్, సౌత్ మెయిన్ బిల్డింగ్ నార్త్ వైపు మల్టీ-లెవల్ కార్ పార్కింగ్, బేస్మెంట్తో కూడిన నార్త్ మెయిన్ బిల్డింగ్ పనులు కొనసాగుతున్నాయి.
ఇంకా ఎయిర్ కాంకోర్స్, కవర్ ఓవర్ ప్లాట్ఫాం, కాజీపేట్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, హైదరాబాద్ వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, స్టేషన్ వెంట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్-కమ్ ట్రావెలేటర్ పనులు పూర్తి కావాల్సి ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఉత్తరం వైపు మల్టీ-లెవెల్ కార్ పార్కింగ్, దక్షిణం వైపు అండర్గ్రౌండ్ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవి స్టేషన్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తాయి.రెండు 7.5 మీటర్ల వెడల్పు కలిగిన నడక దారులను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ప్రయాణికులకు ఒక ప్లాట్ఫాం నుండి మరొక ప్లాట్ఫాంకు వెళ్లడానికి సులభతరంగా ఉంటుంది. స్టేషన్లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు, 2 ట్రావెలర్లు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రయాణికుల కోసం విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టికెట్ కౌంటర్లు, సమాచార కేంద్రాలు, మెరుగైన టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను 2025 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోలార్ పవర్ ప్లాంట్, నీటి సంరక్షణ/రీసైక్లింగ్ వంటి పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నారు.
ప్రయాణికుల కోసం విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఆధునిక టికెట్ కౌంటర్లు, సమాచార కేంద్రాలు, మెరుగైన టాయిలెట్లు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను 2025 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోలార్ పవర్ ప్లాంట్, నీటి సంరక్షణ/రీసైక్లింగ్ వంటి పర్యావరణ అనుకూల చర్యలు తీసుకుంటున్నారు.
E-Paper

