ఫొటోలు : కొనసాగుతున్న నల్గొండ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు - 80 శాతం పూర్తి
“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా నల్గొండ రైల్వే స్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరో 20 శాతం పనులను త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను రైల్వేశాఖ ట్వీట్ చేసింది.
ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని నల్గొండ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది.
ఆధునీకరణ పనులతో నల్గొండ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.17 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను విడుదల చేసింది.
ప్రస్తుతం కవర్ ఓవర్ ఫ్లాట్ ఫామ్స్, లిఫ్ట్ ఫ్లాట్ ఫామ్ సర్ఫెస్, పార్కింగ్, సర్య్యులేటింగ్ ఏరియా పనులు పూర్తయ్యాయి. వెయిటింగ్ హాల్ రినవేషన్, ఎఫ్వోబీ పనులు కొనసాగుతున్నాయి.
రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫాంపైకి చేరుకునేందుకు అధునాతన లిఫ్టు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్త టాయిలెట్లు, వెయిటింగ్ హాల్ ను నిర్మించారు.మిగతా 20 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఆ దిశగానే పనులు కొనసాగుతున్నాయి.
E-Paper

