ఆస్ట్రేలియాతో రెండో వన్డేలోనూ టీమిండియా ఓడిపోవడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..
అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో భారత్ మూడు వన్డేల సిరీస్ ను కూడా కోల్పోయింది. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (73) నిలిచాడు. అయితే ఈ ఓటమికి 5 కారణాలేంటో తెలుసుకోండి.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండో వన్డేలోనూ డకౌట్ అయ్యాడు. తొలి వన్డేలో 8 బంతులు ఆడగా.. రెండో వన్డేలో 4 బంతులకే డకౌటై వెనుదిరిగాడు.
(AP)
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ప్రదర్శన కూడా చాలా పేలవంగా ఉంది. టెస్టుల్లో కెప్టెన్ గా బలమైన ఆరంభం చేసిన గిల్ వన్డేల్లో తన ఫామ్ అందుకోలేకపోతున్నాడు. పెర్త్ లో జరిగిన మ్యాచ్ లో గిల్ 18 బంతుల్లో 10 పరుగులు, అడిలైడ్ లో 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు.
(AP)
రెండో వన్డేలో రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించినా.. మిడిలార్డర్ లో కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి తీవ్రంగా నిరాశ పరచడం కూడా ఓటమికి కారణాల్లో ఒకటిగా చెప్పొచ్చు.
(AP)
ప్రపంచంలోని టాప్ స్పిన్నర్లలో ఒకడిగా ఉన్నప్పటికీ కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కడం లేదు. దీంతో స్పిన్ బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. సుందర్, అక్షర్ లాంటి ఆల్ రౌండర్ల కోసం క్వాలిటీ స్పిన్నర్ ను పక్కన పెట్టి టీమిండియా తగిన మూల్యం చెల్లించుకుంటోంది.
(HT_PRINT)
బుమ్రా లేని నేపథ్యంలో పేస్ బౌలింగ్ భారాన్ని మోయాల్సిన మహ్మద్ సిరాజ్ తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు మ్యాచ్ లలో కలిపి ఒకే ఒక్క వికెట్ తీశాడు. తొలి వన్డేలో 4 ఓవర్లలో 21, రెండో వన్డేలో 10 ఓవర్లలో 49 రన్స్ ఇచ్చాడు.
(AFP)
E-Paper

