వానాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఇవి తాగండి
వర్షాకాలం వచ్చినప్పుడల్లా జలుబు, దగ్గు, జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్లు వరుసగా వస్తుంటాయి. ప్రాచీన కాలం నుండి ఉపయోగిస్తున్న కొన్ని సహజ పానీయాలు ఉన్నాయి. వాటిని ప్రతిరోజూ తాగితే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
వర్షాకాలంలో వంటగది మసాలాల వల్ల మీ ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి. కేవలం రుచికి మాత్రమే పరిమితం కావు. అవి సహజ ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. ఇంట్లో మీ పానీయాలలో అల్లం, పసుపు, నిమ్మకాయను హెర్బల్ టీలను జోడించడం ద్వారా మీరు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో చూద్దాం.
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. దాల్చినచెక్క దీనిని నివారించడంలో సహాయపడుతుంది. దాల్చినచెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. దాల్చినచెక్క పానీయం తయారు చేయడానికి, ఒక దాల్చినచెక్క ముక్కను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం రుచికి తగినంత తేనె కలిపి తాగవచ్చు. ఈ పానీయం వాపు నివారిణిగా పనిచేస్తుంది.
అల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. ఈ తులసి మొక్కకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో రోగనిరోధక హార్మోన్లను ఉత్తేజపరిచే గుణాలు ఉంటాయి. అందువల్ల ఇది శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. వర్షాకాలంలో తులసి, సోంపు గింజలతో చేసిన టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. తులసి, సోంపు గింజలను మరిగే నీటిలో వేయాలి. తర్వాత వడకట్టి, దానికి తేనె కలిపి టీ తయారు చేసుకోవాలి.
ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడమే కాకుండా, వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ఒక ఉత్తమమైన పానీయాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. ఒక గ్లాసు నీటిలో 3-4 టేబుల్ స్పూన్ల కొండ ఉసిరికాయ రసాన్ని కలుపుకొని, రోజుకు రెండుసార్లు తాగవచ్చు.
E-Paper

