Gold price today : మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర- తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.3లక్షలకు చేరువలో..!
అక్టోబర్ 16, గురువారం దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1090 పెరిగి రూ. 1,29,623కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,18,689 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,29,479గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,06,000గా ఉంది.
(Ashok Munjani)
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,18,695 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,29,485గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,06,000గా ఉంది.
(PTI)
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,18,697గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,29,487ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 20,680 ఉంది.
(PTI)
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,18,675- రూ. 1,29,465గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 19,400గాను.. కేజీ వెండి రేటు రూ. 1,94,000గాను కొనసాగుతున్నాయి.
(REUTERS)
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,18,631గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,29,411గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 20,600 ఉంది.
(REUTERS)
E-Paper

