సామాన్యుడికి షాక్! రూ. 2లక్షలు దాటేసిన కేజీ వెండి ధర- నేటి బంగారం ధరలు ఇలా..
అక్టోబర్ 14, మంగళవారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి! దేశ రాజధాని దిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 10 తగ్గి రూ. 1,25,583కి చేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వైజాగ్, విజయవాడ సహా ఇతర ప్రదేశాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,989 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,25,439గా కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ. 2,00,400గా ఉంది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1,14,995 ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 1,25,445గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,01,200గా ఉంది.
(AFP)
ఇక విశాఖపట్నంలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,14,997గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,25,447ను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 19,880 ఉంది.
(PTI)
బెంగళూరులో పసిడి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ. 1,14,975- రూ. 1,25,425గా ఉన్నాయి. 100 గ్రాముల వెండి రేటు రూ. 18,720గాను.. కేజీ వెండి రేటు రూ. 1,87,200గాను కొనసాగుతున్నాయి.
(REUTERS)
ఇక చెన్నైలో 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 1,15,831గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,26,361గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 19,980 ఉంది.
(Jitendra Takale)
E-Paper

