In Pics : ఓరి దేవుడా ఎంతటి దారుణం.. చేవెళ్ల బస్సు ప్రమాదంలో కంకర కింద మృతదేహాలు!
చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఉదయం 4:45 గంటలకు వికారాబాద్లోని తాండూర్ డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. హైదరాబాద్కు వస్తుండగా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద బస్సును కంకరతో వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది.
చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఉదయం 4:45 గంటలకు వికారాబాద్లోని తాండూర్ డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. హైదరాబాద్కు వస్తుండగా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద బస్సును కంకరతో వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది.
కంకర లోడ్తో వస్తూ అతివేగంతో వచ్చి బస్సుని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందారు. వారి శరీరాలు కంకరలో కూరుకుపోయాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. పటాన్చెరు లక్డారం క్రషర్ నుంచి వికారాబాద్ వైపు వెళ్తోంది లారీ. రహదారిపై గుంతను తప్పించబోయి మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లారీ కొట్టింది. ఎదురుగా వచ్చి పూర్తిగా ఆర్టీసీ బస్సుపైకి ఒరిగింది.
బస్సులోని ప్రయాణికులపై లారీలో ఉన్న కంకర పడింది. దీంతో కంకర కింద ప్రయాణికులు కూరుకుపోయారు. మూడు జేసీబీల సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీస్తుంటే హృదాయ విదారక దృశ్యాలు కనిపించాయి.
బస్సుపై కంకరలోడు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అందులో ఉన్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
E-Paper

