Telangana Weather Report : ఇక భానుడి ప్రతాపం....! ఇవాళ్టి నుంచి పెరగనున్న ఎండలు, అంచనాలు ఇలా…!
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత వారంలో వర్షాలు పడగా… ప్రస్తుతం పూర్తిస్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది. నేటి నుంచి ఉష్ణోగ్రతల నమోదు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేశారు.
తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గత వారంలో వర్షాలు పడగా… ప్రస్తుతం పూర్తిస్థాయిలో పొడి వాతావరణమే ఉంటుంది. నేటి(మార్చి 1, 2026) నుంచి ఉష్ణోగ్రతల నమోదు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
(image source pixel)
తెలంగాణ వెదర్ మ్యాన్ (@balaji25_t) రిపోర్ట్ ప్రకారం… ఇవాళ్టి నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వేసవి ఎండలు షురూ అవుతాయి,
(image source pixel)
ముఖ్యంగా మార్చి 3-7 మధ్య, భద్రాద్రి, ఖమ్మం, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి తూర్పు, ఉత్తర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 39 నుంచి 41 డిగ్రీల వలకు నమోదయ్యే సూచనలున్నాయి.
(image source pixel)
ఇదే సమయంలో హైదరాబాద్లో 36 నుంచి 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు, ఇతర జిల్లాల్లో 37-39° డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోయ్యే అవకాశం ఉంది.
(image source pixel)
ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువగా మంచి నీరు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లకుండా ఎండ తీవ్రత తగ్గిన తర్వాత వెళ్లాలని పేర్కొంటున్నారు.
(image source pixel)
E-Paper

