బియ్యాన్ని వండే ముందు ఎన్నిసార్లు కడగాలి? ఇది తప్పక తెలుసుకోవాలి!
చాలా మంది బియ్యాన్ని వండే ముందు ఎన్నిసార్లు కడగాలి అని ప్రశ్నలు వేసుకుంటారు. వండే ముందు బియ్యాన్ని పద్ధతి ప్రకారం వాష్ చేయాలి.
చాలా ఇళ్లలో, చాలామంది బియ్యం కడిగేటప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తారు. బియ్యం తెల్లగా, మెరిసేలా చేయడానికి దాన్ని చాలాసార్లు కడిగి, ఆ తర్వాత వండుతారు. కానీ ఇలా చేయడం వల్ల బియ్యంలోని శక్తి శాతం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బియ్యాన్ని పండించేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు వివిధ పురుగుమందులు, రసాయనాలను ఉపయోగిస్తారు. అలాగే ప్యాకింగ్ చేసేటప్పుడు దుమ్ము, చిన్న రాళ్లు, పొట్టు అందులో చేరి ఉండవచ్చు. వీటిని తొలగించడానికి, బియ్యంపై ఉన్న అదనపు పిండిపదార్థాన్ని శుభ్రపరచడానికి, వండే ముందు దానిని కడగడం చాలా ముఖ్యం. బియ్యాన్ని కడగడం వల్ల అవి ముద్దగా మారవు. దానికి బదులుగా, అవి పొడిపొడిగా, చిన్నగా అవుతాయి.
ఆరోగ్య నిపుణులు, చెఫ్ల ప్రకారం, బియ్యాన్ని గరిష్టంగా రెండు లేదా మూడు సార్లు మాత్రమే కడగాలి. మొదటిసారి నీటిని వంపేసి చేతులతో పిసకడం వల్ల అందులో ఉండే దుమ్ము, మైక్రోప్లాస్టిక్ కణాలు తొలగిపోతాయి. రెండోసారి, బియ్యాన్ని విరగకుండా తేలికగా కడగాలి, దీనివల్ల రసాయనాల ప్రభావం తగ్గుతుంది. మూడోసారి నీళ్లు పోసి కలిపితే, బియ్యం పూర్తిగా శుభ్రపడతాయి. దీనికోసం నీళ్లు పూర్తిగా తెల్లగా అయ్యేంత వరకు కడగాల్సిన అవసరం లేదు. నిజానికి రెండుసార్లు కడగడం చాలా ఎక్కువ.
బియ్యాన్ని పదేపదే బలంగా కడగడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయి. బియ్యపు తవుడులో శరీరానికి అవసరమైన విటమిన్ బి-కాంప్లెక్స్(ముఖ్యంగా థయామిన్), ఐరన్, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి. అయితే బియ్యాన్ని పదేపదే రుద్ది కడగడం వల్ల ఈ పోషకాలన్నీ నీటిలో కరిగి వృథా అయిపోతాయి.
బియ్యాన్ని చాలాసార్లు కడగడం వల్ల దాని సహజ సువాసన తగ్గిపోయి, మెత్తగా అవుతుంది. బియ్యం కడిగిన తర్వాత వచ్చే నీటిని పారేయకుండా, మీ ఇంట్లోని మొక్కలకు పోస్తే అది అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది. లేదా ఆ నీటితో ముఖం కడుక్కుంటే, మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.
E-Paper

