బియ్యాన్ని వండే ముందు ఎన్నిసార్లు కడగాలి? ఇది తప్పక తెలుసుకోవాలి!

Published on Jun 01, 2026 09:20 am IST

చాలా మంది బియ్యాన్ని వండే ముందు ఎన్నిసార్లు కడగాలి అని ప్రశ్నలు వేసుకుంటారు. వండే ముందు బియ్యాన్ని పద్ధతి ప్రకారం వాష్ చేయాలి.

1 / 5
<p>చాలా ఇళ్లలో, చాలామంది బియ్యం కడిగేటప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తారు. బియ్యం తెల్లగా, మెరిసేలా చేయడానికి దాన్ని చాలాసార్లు కడిగి, ఆ తర్వాత వండుతారు. కానీ ఇలా చేయడం వల్ల బియ్యంలోని శక్తి శాతం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2026 09:20 am IST

చాలా ఇళ్లలో, చాలామంది బియ్యం కడిగేటప్పుడు ఒక పెద్ద తప్పు చేస్తారు. బియ్యం తెల్లగా, మెరిసేలా చేయడానికి దాన్ని చాలాసార్లు కడిగి, ఆ తర్వాత వండుతారు. కానీ ఇలా చేయడం వల్ల బియ్యంలోని శక్తి శాతం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
<p>బియ్యాన్ని పండించేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు వివిధ పురుగుమందులు, రసాయనాలను ఉపయోగిస్తారు. అలాగే ప్యాకింగ్ చేసేటప్పుడు దుమ్ము, చిన్న రాళ్లు, పొట్టు అందులో చేరి ఉండవచ్చు. వీటిని తొలగించడానికి, బియ్యంపై ఉన్న అదనపు పిండిపదార్థాన్ని శుభ్రపరచడానికి, వండే ముందు దానిని కడగడం చాలా ముఖ్యం. బియ్యాన్ని కడగడం వల్ల అవి ముద్దగా మారవు. దానికి బదులుగా, అవి పొడిపొడిగా, చిన్నగా అవుతాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2026 09:20 am IST

బియ్యాన్ని పండించేటప్పుడు, నిల్వ చేసేటప్పుడు వివిధ పురుగుమందులు, రసాయనాలను ఉపయోగిస్తారు. అలాగే ప్యాకింగ్ చేసేటప్పుడు దుమ్ము, చిన్న రాళ్లు, పొట్టు అందులో చేరి ఉండవచ్చు. వీటిని తొలగించడానికి, బియ్యంపై ఉన్న అదనపు పిండిపదార్థాన్ని శుభ్రపరచడానికి, వండే ముందు దానిని కడగడం చాలా ముఖ్యం. బియ్యాన్ని కడగడం వల్ల అవి ముద్దగా మారవు. దానికి బదులుగా, అవి పొడిపొడిగా, చిన్నగా అవుతాయి.

3 / 5
<p>ఆరోగ్య నిపుణులు, చెఫ్‌ల ప్రకారం, బియ్యాన్ని గరిష్టంగా రెండు లేదా మూడు సార్లు మాత్రమే కడగాలి. మొదటిసారి నీటిని వంపేసి చేతులతో పిసకడం వల్ల అందులో ఉండే దుమ్ము, మైక్రోప్లాస్టిక్ కణాలు తొలగిపోతాయి. రెండోసారి, బియ్యాన్ని విరగకుండా తేలికగా కడగాలి, దీనివల్ల రసాయనాల ప్రభావం తగ్గుతుంది. మూడోసారి నీళ్లు పోసి కలిపితే, బియ్యం పూర్తిగా శుభ్రపడతాయి. దీనికోసం నీళ్లు పూర్తిగా తెల్లగా అయ్యేంత వరకు కడగాల్సిన అవసరం లేదు. నిజానికి రెండుసార్లు కడగడం చాలా ఎక్కువ.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2026 09:20 am IST

ఆరోగ్య నిపుణులు, చెఫ్‌ల ప్రకారం, బియ్యాన్ని గరిష్టంగా రెండు లేదా మూడు సార్లు మాత్రమే కడగాలి. మొదటిసారి నీటిని వంపేసి చేతులతో పిసకడం వల్ల అందులో ఉండే దుమ్ము, మైక్రోప్లాస్టిక్ కణాలు తొలగిపోతాయి. రెండోసారి, బియ్యాన్ని విరగకుండా తేలికగా కడగాలి, దీనివల్ల రసాయనాల ప్రభావం తగ్గుతుంది. మూడోసారి నీళ్లు పోసి కలిపితే, బియ్యం పూర్తిగా శుభ్రపడతాయి. దీనికోసం నీళ్లు పూర్తిగా తెల్లగా అయ్యేంత వరకు కడగాల్సిన అవసరం లేదు. నిజానికి రెండుసార్లు కడగడం చాలా ఎక్కువ.

4 / 5
<p>బియ్యాన్ని పదేపదే బలంగా కడగడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయి. బియ్యపు తవుడులో శరీరానికి అవసరమైన విటమిన్ బి-కాంప్లెక్స్(ముఖ్యంగా థయామిన్), ఐరన్, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి. అయితే బియ్యాన్ని పదేపదే రుద్ది కడగడం వల్ల ఈ పోషకాలన్నీ నీటిలో కరిగి వృథా అయిపోతాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2026 09:20 am IST

బియ్యాన్ని పదేపదే బలంగా కడగడం వల్ల అందులోని పోషకాలు నశిస్తాయి. బియ్యపు తవుడులో శరీరానికి అవసరమైన విటమిన్ బి-కాంప్లెక్స్(ముఖ్యంగా థయామిన్), ఐరన్, పీచుపదార్థం వంటి పోషకాలు ఉంటాయి. అయితే బియ్యాన్ని పదేపదే రుద్ది కడగడం వల్ల ఈ పోషకాలన్నీ నీటిలో కరిగి వృథా అయిపోతాయి.

5 / 5
<p>బియ్యాన్ని చాలాసార్లు కడగడం వల్ల దాని సహజ సువాసన తగ్గిపోయి, మెత్తగా అవుతుంది. బియ్యం కడిగిన తర్వాత వచ్చే నీటిని పారేయకుండా, మీ ఇంట్లోని మొక్కలకు పోస్తే అది అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది. లేదా ఆ నీటితో ముఖం కడుక్కుంటే, మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 01, 2026 09:20 am IST

బియ్యాన్ని చాలాసార్లు కడగడం వల్ల దాని సహజ సువాసన తగ్గిపోయి, మెత్తగా అవుతుంది. బియ్యం కడిగిన తర్వాత వచ్చే నీటిని పారేయకుండా, మీ ఇంట్లోని మొక్కలకు పోస్తే అది అద్భుతమైన ఎరువుగా పనిచేస్తుంది. లేదా ఆ నీటితో ముఖం కడుక్కుంటే, మీ చర్మం కాంతివంతంగా మారుతుంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!