AP Thalliki Vandanam Scheme Status : తల్లికి వందనం స్కీమ్ అప్డేట్ - మీ వాట్సాప్ లోనే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Published on Jul 24, 2026 07:05 pm IST

AP Govt Thalliki Vandanam Scheme Status : తల్లికి వందనం స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా మొబైల్‌లోనే పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

1 / 7
<p>'తల్లికి వందనం' పథకానికి సంబంధించిన ఆర్థిక సాయం నిధుల జమ ప్రక్రియపై లబ్ధిదారులకు కొత్త అప్డేట్ వచ్చేసింది. పేమెంట్ స్టేటస్ లేదా దరఖాస్తు స్థితి తెలుసుకోవడానికి లబ్ధిదారులు గ్రామ సచివాలయాలు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. 'మన మిత్ర' (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ వేదిక ద్వారా కేవలం ఒక్క మెసేజ్‌తో తమ పేమెంట్ స్టేటస్‌ను లబ్ధిదారులు సులభంగా తెలుసుకోవచ్చు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 24, 2026 07:05 pm IST

'తల్లికి వందనం' పథకానికి సంబంధించిన ఆర్థిక సాయం నిధుల జమ ప్రక్రియపై లబ్ధిదారులకు కొత్త అప్డేట్ వచ్చేసింది. పేమెంట్ స్టేటస్ లేదా దరఖాస్తు స్థితి తెలుసుకోవడానికి లబ్ధిదారులు గ్రామ సచివాలయాలు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. 'మన మిత్ర' (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ వేదిక ద్వారా కేవలం ఒక్క మెసేజ్‌తో తమ పేమెంట్ స్టేటస్‌ను లబ్ధిదారులు సులభంగా తెలుసుకోవచ్చు.

2 / 7
<p>ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల చేతిలోని మొబైల్ ఫోన్లలోకే తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 'తల్లికి వందనం' పథకం పురోగతి, ఖాతాల్లో డబ్బులు జమ అయిన వివరాలు, దరఖాస్తు పెండింగ్‌లో ఉందా లేదా ప్రాసెస్ పూర్తయిందా అనే అంశాలను క్షణాల్లో తెలుసుకునేందుకు వీలు కల్పించారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 24, 2026 07:05 pm IST

ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల చేతిలోని మొబైల్ ఫోన్లలోకే తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 'తల్లికి వందనం' పథకం పురోగతి, ఖాతాల్లో డబ్బులు జమ అయిన వివరాలు, దరఖాస్తు పెండింగ్‌లో ఉందా లేదా ప్రాసెస్ పూర్తయిందా అనే అంశాలను క్షణాల్లో తెలుసుకునేందుకు వీలు కల్పించారు.

3 / 7
<div><p>ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో 'మన మిత్ర' అధికారిక వాట్సాప్ నంబర్ <strong>9552300009</strong> ను సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ నంబర్‌కు <strong>Hi</strong> అని మెసేజ్ పంపాలి. స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే ఆప్షన్ల నుంచి 'ప్రభుత్వ సేవలు' (Government Services) లేదా విద్యా పథకాల విభాగాన్ని ఎంచుకోవాలి. అందులో తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకోవాలి.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 24, 2026 07:05 pm IST

ముందుగా మీ మొబైల్ ఫోన్‌లో 'మన మిత్ర' అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ను సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ నంబర్‌కు Hi అని మెసేజ్ పంపాలి. స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే ఆప్షన్ల నుంచి 'ప్రభుత్వ సేవలు' (Government Services) లేదా విద్యా పథకాల విభాగాన్ని ఎంచుకోవాలి. అందులో తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకోవాలి.

4 / 7
<p>ఆ తర్వాత లబ్ధిదారురాలైన తల్లి లేదా విద్యార్థి యొక్క 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే, వెంటనే మీ పేమెంట్ స్టేటస్ (Success లేదా Pending) స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 24, 2026 07:05 pm IST

ఆ తర్వాత లబ్ధిదారురాలైన తల్లి లేదా విద్యార్థి యొక్క 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే, వెంటనే మీ పేమెంట్ స్టేటస్ (Success లేదా Pending) స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.

5 / 7
<p>ఒకవేళ మీ స్టేటస్‌లో 'Pending' అని కనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రధాన కారణాలను స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ లేదా NPCI మ్యాపింగ్ సరిగా కాకపోవడం, ఆధార్ ధ్రువీకరణ లేదా ఈ-కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉండటం, పాఠశాలలో విద్యార్థికి ఉండాల్సిన కనీస హాజరు శాతం పూర్తి కాకపోవడం వంటి కారణాలతో మాత్రమే పెండింగ్ అని వస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 24, 2026 07:05 pm IST

ఒకవేళ మీ స్టేటస్‌లో 'Pending' అని కనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రధాన కారణాలను స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ లేదా NPCI మ్యాపింగ్ సరిగా కాకపోవడం, ఆధార్ ధ్రువీకరణ లేదా ఈ-కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉండటం, పాఠశాలలో విద్యార్థికి ఉండాల్సిన కనీస హాజరు శాతం పూర్తి కాకపోవడం వంటి కారణాలతో మాత్రమే పెండింగ్ అని వస్తుంది.

6 / 7
<p>ఇలాంటి సాంకేతిక సమస్యలు లేదా సుదీర్ఘకాలం పాటు పెండింగ్ అని వస్తున్న సందర్భాల్లో లబ్ధిదారులు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ లేదా సంక్షేమ సహాయకుడిని కలిసి వివరాలు సరిచేసుకోవచ్చు. సచివాలయ సిబ్బంది మీ డాక్యుమెంట్లను పునఃపరిశీలించి సమస్యను తక్షణమే పరిష్కరిస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 24, 2026 07:05 pm IST

ఇలాంటి సాంకేతిక సమస్యలు లేదా సుదీర్ఘకాలం పాటు పెండింగ్ అని వస్తున్న సందర్భాల్లో లబ్ధిదారులు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ లేదా సంక్షేమ సహాయకుడిని కలిసి వివరాలు సరిచేసుకోవచ్చు. సచివాలయ సిబ్బంది మీ డాక్యుమెంట్లను పునఃపరిశీలించి సమస్యను తక్షణమే పరిష్కరిస్తారు.

7 / 7
<p>మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ ఉచిత వాట్సాప్ సేవ వల్ల వేలాది మంది తల్లులకు సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా నేరుగా తమ హక్కును ఇంట్లో నుంచే పొందే వీలు ఏర్పడింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 24, 2026 07:05 pm IST

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ ఉచిత వాట్సాప్ సేవ వల్ల వేలాది మంది తల్లులకు సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా నేరుగా తమ హక్కును ఇంట్లో నుంచే పొందే వీలు ఏర్పడింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!