AP Thalliki Vandanam Scheme Status : తల్లికి వందనం స్కీమ్ అప్డేట్ - మీ వాట్సాప్ లోనే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
AP Govt Thalliki Vandanam Scheme Status : తల్లికి వందనం స్కీమ్ డబ్బులు జమవుతున్నాయి. లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా 'మన మిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా మొబైల్లోనే పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
'తల్లికి వందనం' పథకానికి సంబంధించిన ఆర్థిక సాయం నిధుల జమ ప్రక్రియపై లబ్ధిదారులకు కొత్త అప్డేట్ వచ్చేసింది. పేమెంట్ స్టేటస్ లేదా దరఖాస్తు స్థితి తెలుసుకోవడానికి లబ్ధిదారులు గ్రామ సచివాలయాలు లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. 'మన మిత్ర' (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్ వేదిక ద్వారా కేవలం ఒక్క మెసేజ్తో తమ పేమెంట్ స్టేటస్ను లబ్ధిదారులు సులభంగా తెలుసుకోవచ్చు.
ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల చేతిలోని మొబైల్ ఫోన్లలోకే తీసుకెళ్లే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 'మన మిత్ర' వాట్సాప్ సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 'తల్లికి వందనం' పథకం పురోగతి, ఖాతాల్లో డబ్బులు జమ అయిన వివరాలు, దరఖాస్తు పెండింగ్లో ఉందా లేదా ప్రాసెస్ పూర్తయిందా అనే అంశాలను క్షణాల్లో తెలుసుకునేందుకు వీలు కల్పించారు.
ముందుగా మీ మొబైల్ ఫోన్లో 'మన మిత్ర' అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ను సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ నంబర్కు Hi అని మెసేజ్ పంపాలి. స్క్రీన్పై ప్రత్యక్షమయ్యే ఆప్షన్ల నుంచి 'ప్రభుత్వ సేవలు' (Government Services) లేదా విద్యా పథకాల విభాగాన్ని ఎంచుకోవాలి. అందులో తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకోవాలి.
ముందుగా మీ మొబైల్ ఫోన్లో 'మన మిత్ర' అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ను సేవ్ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్ ఓపెన్ చేసి, ఆ నంబర్కు Hi అని మెసేజ్ పంపాలి. స్క్రీన్పై ప్రత్యక్షమయ్యే ఆప్షన్ల నుంచి 'ప్రభుత్వ సేవలు' (Government Services) లేదా విద్యా పథకాల విభాగాన్ని ఎంచుకోవాలి. అందులో తల్లికి వందనం పథకాన్ని ఎంపిక చేసుకోవాలి.
ఆ తర్వాత లబ్ధిదారురాలైన తల్లి లేదా విద్యార్థి యొక్క 12 అంకెల ఆధార్ నంబర్ను నమోదు చేయాలి. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP) ని ఎంటర్ చేసి వెరిఫై చేస్తే, వెంటనే మీ పేమెంట్ స్టేటస్ (Success లేదా Pending) స్క్రీన్పై స్పష్టంగా కనిపిస్తుంది.
ఒకవేళ మీ స్టేటస్లో 'Pending' అని కనిపిస్తే ఆందోళన చెందాల్సిన పనిలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం కొన్ని ప్రధాన కారణాలను స్పష్టం చేసింది. బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ లేదా NPCI మ్యాపింగ్ సరిగా కాకపోవడం, ఆధార్ ధ్రువీకరణ లేదా ఈ-కేవైసీ ప్రక్రియ పెండింగ్లో ఉండటం, పాఠశాలలో విద్యార్థికి ఉండాల్సిన కనీస హాజరు శాతం పూర్తి కాకపోవడం వంటి కారణాలతో మాత్రమే పెండింగ్ అని వస్తుంది.
ఇలాంటి సాంకేతిక సమస్యలు లేదా సుదీర్ఘకాలం పాటు పెండింగ్ అని వస్తున్న సందర్భాల్లో లబ్ధిదారులు తమ పరిధిలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి డిజిటల్ అసిస్టెంట్ లేదా సంక్షేమ సహాయకుడిని కలిసి వివరాలు సరిచేసుకోవచ్చు. సచివాలయ సిబ్బంది మీ డాక్యుమెంట్లను పునఃపరిశీలించి సమస్యను తక్షణమే పరిష్కరిస్తారు.
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా సంక్షేమ ఫలాలను అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. ఈ ఉచిత వాట్సాప్ సేవ వల్ల వేలాది మంది తల్లులకు సమయం, డబ్బు ఆదా అవ్వడమే కాకుండా నేరుగా తమ హక్కును ఇంట్లో నుంచే పొందే వీలు ఏర్పడింది.
E-Paper

