సరికొత్త హంగులతో 'హైటెక్ సిటీ రైల్వే స్టేషన్' - ఈ కొత్త ఫొటోలు చూడండి
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇప్పటివరకు 81 శాతం పనులు పూర్తయ్యాయి. తాజా ఫొటోలు ఇక్కడ చూడండి…..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి.
.రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది.
ఇందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టారు. గతేడాదే ప్రతిపాదిత నమూనాను కూడా రైల్వే శాఖ ఖరారు చేయగా… డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా విడుదల వివరాల ప్రకారం… ఇప్పటివరకు 81 శాతం పనులు పూర్తయ్యాయి. కీలమైన పనులు కంప్లీట్ అయ్యాయి. త్వరలో నే అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఫొటోలు కూడా షేర్ చేశారు.
ఎంట్రీ ర్యాంప్, దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు,
ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లాంచింగ్
ప్లాట్ఫారమ్లపై కవర్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయి.
12 మీటర్ల వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (రాంప్తో) ,స్టేషన్ భవనం ఫినిషింగ్ పనులు, సర్క్యులేటింగ్ ఏరియా అభివృద్ధి,
వెయిటింగ్ హాల్ మరియు బుకింగ్ ఆఫీస్
అప్రోచ్ రోడ్, నిర్మాణం
లిఫ్ట్, ఎస్కలేటర్లు
ఆధునిక టాయిలెట్లు పనులు పురోగతిలో ఉన్నాయి.
మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా రైల్వేశాఖ అడుగులు వేస్తోంది.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను రూ.26.6 కోట్ల అంచనా వ్యయంతో రీడెవలప్ మెంట్ పనులు కొనసాగుతున్నాయి. హైటెక్ హంగులతో ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు.
అమృత్ భారత్ పథకంలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణలో పునరాభివృద్ధి జరుగుతున్న 40 రైల్వే స్టేషన్లలో ఈ స్టేషన్ కూడా ఒకటిగా ఉంది. ఇందులో భాగంగానే ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
E-Paper

