వెదర్ రిపోర్ట్ : ఏపీ, తెలంగాణకు వర్ష సూచన - ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. వెదర్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి….
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.
దక్షిణ అంతర్హత కర్ణాటక దక్షిణ ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిమీ ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు దక్షిణ కర్ణాటక నుంచి మహారాష్ట్ర వరకు ఉన్న ద్రోణి ఈరోజు... ఉత్తర కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తులో విస్తరించి ఉంది.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లుల పడొచ్చు. రేపు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
రాలసీలమలో ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాగల 3 రోజుల్లో కోస్తాంధ్ర, సీమలో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పులు ఉండవు.
ఇక తెలంగాణలో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం.... కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే సూచనలున్నాయి.
ఇవాళ తెలంగాణలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
E-Paper

