AP Telangana Weather : ఓవైపు ఎండలు... మరోవైపు వర్ష సూచన - తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..!

Published on Apr 29, 2026 09:03 am IST

AP Telangana Weather Forecast : తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండలు దంచికొడుతుండగా… మరోవైపు వర్షాలు పడుతున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే సూచనలున్నాయి.

1 / 6
<p>ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది కొమరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 09:03 am IST

ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది కొమరిన్ ప్రాంతం నుంచి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది.

2 / 6
<p>ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఓవైపు ఎండలు ఉన్నప్పటికీ…. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 09:03 am IST

ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఓవైపు ఎండలు ఉన్నప్పటికీ…. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని చాలా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

3 / 6
<p>ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలోని మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 09:03 am IST

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ ఏపీలోని మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

4 / 6
<p>బుధవారం (29-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.</p>(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 09:03 am IST

బుధవారం (29-04-26) అధిక ఉష్ణోగ్రతలతో పాటు విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వడగాలులు, ఎండ తీవ్రత, ఉక్కపోత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

(image source @APSDMA)

5 / 6
<p>ఇక తెలంగాణలో చూస్తే మరో మూడు నాలుగు రోజులు వర్షాలు పడే సూచనలున్నాయి. ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 09:03 am IST

ఇక తెలంగాణలో చూస్తే మరో మూడు నాలుగు రోజులు వర్షాలు పడే సూచనలున్నాయి. ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

6 / 6
<p>మే 1,2 తేదీల్లోనూ తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచికొడుతున్నాయి. </p>(image istock) expand-icon View Photos in a new improved layout
Published on Apr 29, 2026 09:03 am IST

మే 1,2 తేదీల్లోనూ తెలంగాణలో వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు కూడా దంచికొడుతున్నాయి.

(image istock)

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!