Cyclone Senyar : తుపాన్ గా బలపడిన తీవ్ర వాయుగుండం - ఏపీ రైతులకు ఐఎండీ హెచ్చరికలు
మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్రవాయుగుండం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ తుపానుగా బలపడింది. 24 గంటలు తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
మలక్కా జలసంధి ప్రాంతాల్లో తీవ్రవాయుగుండం కొనసాగుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతూ ఇవాళ తుపానుగా బలపడింది. దీనికి సెన్యార్ గా నామకరణం చేశారు.24 గంటలు తర్వాత క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది.
మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక మరియు హిందూ మహాసముద్రం మీదుగా అల్పపీడనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్రఅల్పపీడనంగా* మారే అవకాశం ఉందంది. ఆ తదుపరి 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది.
గురువారం నుంచి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది.
వీటి ప్రభావంతో శనివారం నుంచి మంగళవారం వరకు (నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2) కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత చర్యలతో తక్షణం సన్నద్ధం కావాలని సూచించారు. బంగాళాఖాతంలో నెలకొన్న అనుకూల పరిస్థితులు కారణంగా తుఫాన్ ప్రభావం రానున్న 48 గంటల్లో తీవ్రత పేరిగే అవకాశం ఉండడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని క్షేత్ర స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అలెర్టె చేయాలని నిర్ధేశించారు.
రాయలసీమ ప్రాంతంతో పాటు ఉత్తర కొస్తా అంతటా ఈ ప్రభావం ఉంటుందని ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్ధ నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులు గమనించి రైతులు సమాచారం అందివ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు రైతులు పాటించాలని సూచించారు. సముద్రం అలజడిగా మారుతున్న నేపథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లరాదని వాతావణ శాఖ హెచ్చరిక జారీ చేసిందని, ఇప్పటికే చేపలు వేళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకోవాని సూచించడం జరిగిందని అధికారులు సూచనలు పాటించాలని చెప్పారు.
E-Paper

