IMD Weather Report : ఏపీ, తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనం - ఇవాళ ఈ జిల్లాలకు వర్ష సూచన..!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
తెలంగాణ, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణశాఖ పేర్కొంది. దీని మీదుగా మన్నార్ వరకు ద్రోణిగా విస్తరించి ఉందని తెలిపింది.
(image source @APSDMA)
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ(ఏప్రిల్ 8) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం,అల్లూరి,పోలవరం,విశాఖ,అనకాపల్లి,కాకినాడ, కోనసీమ,తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి,ఏలూరు,కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బాపట్ల,పల్నాడు,మర్కాపురం,ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయి.
మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లాలోని కోర్లాంలో 59.5 మిమీ, అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో 55.2మిమీ, రాజంలో 47మిమీ, కె.కోటపాడులో 21.2మిమీ, చొప్పున అధిక వర్షపాతం నమోదైందనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.
ఇక తెలంగాణలో కూడా ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏప్రిల్ 9వ తేదీన పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
E-Paper

