AP Weather Updates : కొనసాగుతున్న ద్రోణి ప్రభావం - ఏపీకి వర్ష సూచన, ఐఎండీ అంచనాలు
ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండనుంది.
ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండనుంది.
అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. మున్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సగట్టు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించింది. ఏపీ, యానాం మీదుగా దిగువ ఉష్ణమండల/ దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయి.
ద్రోణి ప్రభావంతో.... ఇవాళ ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతాయి. రేపు పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుంది.
దక్షిణ కోస్తాలో చూస్తే… వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్షసూచన లేదని పేర్కొంది.
రాయలసీమకు కూడా ఎలాంటి వర్ష సూచన లేదు. ఇవాళ, రేపు, ఎల్లుండి పొడి వాతావరణం ఉంటుంది. ఎండల తీవ్రత కూడా ఎక్కువగానే ఉండనుంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
(image istock)
E-Paper

