ఐఎండీ వెదర్ రిపోర్ట్ : ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన - ఈ జిల్లాలకు హెచ్చరికలు..!
ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. 'దిత్వా' తుఫాన్ ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోండి…
నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో 'దిత్వా' తుపాను ప్రస్తుతానికి కారైకాల్ కి 220 కి,మీ.,పుదుచ్చేరికి 330 కి.మీ, చెన్నైకి 430కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది.
గడిచిన 6 గంటల్లో 7కి.మీ వేగంతో కదిలినట్లు ఐఎండీ తెలిపింది.
రేపు తెల్లవారుజామునకు తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.ఈ ప్రభావంతో ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉంది.
ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.
(image source @APSDMA)
బాపట్ల,పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని….
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
తెలంగాణలో ఇవాళ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీ నుంచి పొడి వాతావరణమే ఉండనుంది.
E-Paper

