Telangana Rains : చల్లబడిన వాతావరణం - హైదరాబాద్‌లో పలుచోట్ల వడగళ్ల వర్షం..! ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు

Published on Apr 19, 2026 05:47 pm IST

హైదరాబాద్ తో పాటు చాలా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత చాలా ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

1 / 6
<p>హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత నగరంలోని చాలాచోట్ల వర్షం మొదలైంది. దీంతో భానుడి భగభగలకి ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు ఉపశమనం కలిగినట్లు అయింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 19, 2026 05:47 pm IST

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం తర్వాత నగరంలోని చాలాచోట్ల వర్షం మొదలైంది. దీంతో భానుడి భగభగలకి ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులకు ఉపశమనం కలిగినట్లు అయింది.

2 / 6
<p>హైదరాబాద్‌లో పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్‌పల్లి, బాలానగర్‌లో వడగళ్ల వాన పడగా… కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, సికింద్రబాద్‌, తిరమలగిరి, అల్వాల్‌లో మోస్తారు వర్షం పడింది.<br> </p>(istock images) expand-icon View Photos in a new improved layout
Published on Apr 19, 2026 05:47 pm IST

హైదరాబాద్‌లో పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. బోయిన్‌పల్లి, బాలానగర్‌లో వడగళ్ల వాన పడగా… కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, సికింద్రబాద్‌, తిరమలగిరి, అల్వాల్‌లో మోస్తారు వర్షం పడింది.

(istock images)

3 / 6
<p>ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఎండ తగ్గిపోగా… వాతావరణం చల్లబడింది.</p>(AFP File ) expand-icon View Photos in a new improved layout
Published on Apr 19, 2026 05:47 pm IST

ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత ఎండ తగ్గిపోగా… వాతావరణం చల్లబడింది.

(AFP File )

4 / 6
<p>వేసవి తాపంతో అల్లాడుతున్న సమయంలో కురిసిన ఈ అకాల వర్షం ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రాబోయే కొన్ని గంటల పాటు నగరంలో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు సూచించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 19, 2026 05:47 pm IST

వేసవి తాపంతో అల్లాడుతున్న సమయంలో కురిసిన ఈ అకాల వర్షం ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగరవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, రాబోయే కొన్ని గంటల పాటు నగరంలో అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు సూచించారు.

5 / 6
<p>ఏప్రిల్ 19 నుంచి 22 వరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. </p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 19, 2026 05:47 pm IST

ఏప్రిల్ 19 నుంచి 22 వరకు రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు కొమురంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్ధపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

6 / 6
<p>ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.</p>(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Apr 19, 2026 05:47 pm IST

ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. మరికొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(image source @APSDMA)

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!