బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణకు వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి వర్షాలు, ఉపరితల గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీపై దీని ప్రభావం తక్కువగా ఉండనుంది.
తెలుగు రాష్ట్రాల వాతావరణంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి అనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ - ఉత్తర ఒడిశా తీరాల వద్ద నూతనంగా అల్పపీడనంర్పడింది.
రాబోయే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉన్పటికీ…. ప్రస్తుత వాతావరణ సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీని ప్రభావం చాలా తక్కువగానే ఉండవచ్చని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
ఏపీలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం , మన్యం అల్లూరి, విశాఖ, అనకాపల్లి, ఏలూరు కృష్ణా, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
జులై 30 నుంచి జులై 31 వరకు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. ఉపరితల గాలులు వీస్తాయి.
అమరావతి వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం…. మున్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. సగట్టు సగటు సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించింది. ఏపీ, యానాం మీదుగా దిగువ ఉష్ణమండల/ దక్షిణ/నైరుతి గాలులు వీస్తున్నాయి.
E-Paper

