Ind vs Afg ODI: జయహో జైస్వాల్.. సెంచరీతో చెలరేగిన కుర్రాడు.. రఫ్పాడించిన రోహిత్.. అఫ్గాన్ పై ఇండియా క్లీన్ స్వీప్
Ind vs Afg ODI: టీమిండియా అదరగొట్టింది. పసి కూన అఫ్గానిస్థాన్ ను కుమ్మేసింది. కుర్రాడు యశస్వి జైస్వాల్ సెంచరీతో.. సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ అదిరే ఇన్నిగ్స్ తో చెలరేగారు. దీంతో మూడో వన్డేలోనూ విక్టరీ సాధించిన ఇండియా సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది.
టీమిండియా యంగ్ గన్ యశస్వి జైస్వాల్ మరోసారి పేలాడు. అఫ్గానిస్థాన్ తో రెండో వన్డేలో సెంచరీతో అదరగొట్టాడు.
(AP Photo/Mahesh Kumar A.)
అఫ్గానిస్థాన్ తో మూడో వన్డేలో జైస్వాల్ శతకం బాదాడు. 86 బాల్స్ లో 110 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. ఇందులో 14 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి. జైస్వాల్ సెంచరీతో శనివారం (జూన్ 20) జరిగిన వన్డేలో ఇండియా 9 వికెట్ల తేడాతో గెలిచింది.
(PTI)
ఛేజింగ్ లో హిట్ మ్యాన్ కూడా సత్తాచాటాడు. ఈ సీనియర్ ఓపెనర్ 69 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. దీంతో ఛేజింగ్ ను ఇండియా 28.4 ఓవర్లలోనే కంప్లీట్ చేసింది.
(AP Photo/Mahesh Kumar A.)
అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన అఫ్గానిస్థాన్ ను ప్రసిద్ధ్ కృష్ణ హడలెత్తించాడు. ఈ ఇండియన్ పేసర్ 5 వికెట్లతో చెలరేగడంతో అఫ్గాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది.
(PTI)
అఫ్గానిస్థాన్ తో వన్డే సిరీస్ లో టీమిండియా ఫుల్ డామినెన్స్ చూపించింది. మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
(AFP)
E-Paper

