వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా.. రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ, హర్మన్ మెరుపు ఇన్నింగ్స్.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు
వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ చేరింది టీమిండియా. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, అజేయ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఊహకందని విజయాన్ని అందుకుంది. జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన సెంచరీ, హర్మన్ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.
ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఓ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించింది. వుమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అత్యంత మరుపు రాని ఇన్నింగ్స్ తో జెమీమా రోడ్రిగ్స్ ఇండియన్ టీమ్ ను ఫైనల్ చేర్చింది.
(PTI)
స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. టీమ్ ను గెలిపించిన తర్వాత ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.
(AP)
ఆస్ట్రేలియాలాంటి టీమ్ పై, అది కూడా 339 పరుగుల లక్ష్య ఛేదన ఊహకందనిదే. ఈ రికార్డు బ్రేకింగ్ చేజ్ తో ఇండియన్ టీమ్ వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. కప్పు కోసం సౌతాఫ్రికాతో తలపడనుంది. ఎవరు గెలిచినా ఈసారి ఓ కొత్త విజేత అవతరించనుంది.
(REUTERS)
నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ సెమీఫైనల్లో ఇండియన్ వుమెన్స్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి ఈ రికార్డు చేజ్ చేసింది. అమన్జోత్ కౌర్ ఫోర్ కొట్టగానే స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకుల అరుపులతో మార్మోగిపోయింది.
(AP)
ఓపెనర్లు షెఫాలీ, స్మృతి విఫలమైనా కెప్టెన్ హర్మన్ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 88 బంతుల్లోనే 89 పరుగులు చేయడం, జెమీమాతో భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమ్ విజయం వైపు అడుగులు వేసింది.
(@BCCIWomen X)
హర్మన్, జెమీమా కలిసి మూడో వికెట్ కు ఏకంగా 167 పరుగులు జోడించడంతో ఇండియన్ టీమ్ ఈ సంచలన విజయాన్ని అందుకుంది. మరో 9 బంతులు మిగిలి ఉండగానే 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.
(Raju Shinde)
మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ తో 26 పరుగులు చేయడం కూడా టీమ్ కు కలిసి వచ్చింది. కీలకమైన సమయంలో హర్మన్, రిచా ఔటైనా జెమీమా మాత్రం చివరి వరకూ క్రీజులో నిలిచి అసాధ్యమనుకున్న విజయాన్ని అందించింది.
(AP)
అంతకుముందు ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఓపెనర్ ఫోబె లిచ్ఫీల్డ్ 93 బంతుల్లోనే 119 పరుగులు చేసింది.
(HT_PRINT)
లిస్ పెర్రీ కూడా 88 బంతుల్లో 77 రన్స్ చేయడంతోపాటు లిచ్ఫీల్డ్ తో కలిసి రెండో వికెట్ కు 155 రన్స్ జోడించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.
(PTI)
E-Paper

