వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా.. రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ, హర్మన్ మెరుపు ఇన్నింగ్స్.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు

By Hari Prasad S, Hyderabad
Published on Oct 31, 2025 06:50 am IST

వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ చేరింది టీమిండియా. సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్, అజేయ ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఊహకందని విజయాన్ని అందుకుంది. జెమీమా రోడ్రిగ్స్ అద్భుతమైన సెంచరీ, హర్మన్‌ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

1 / 9
<p>ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఓ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించింది. వుమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అత్యంత మరుపు రాని ఇన్నింగ్స్ తో జెమీమా రోడ్రిగ్స్ ఇండియన్ టీమ్ ను ఫైనల్ చేర్చింది.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. ఓ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అత్యంత భారీ లక్ష్యాన్ని ఛేదించింది. వుమెన్స్ క్రికెట్ చరిత్రలోనే ఓ అత్యంత మరుపు రాని ఇన్నింగ్స్ తో జెమీమా రోడ్రిగ్స్ ఇండియన్ టీమ్ ను ఫైనల్ చేర్చింది.

(PTI)

2 / 9
<p>స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. టీమ్ ను గెలిపించిన తర్వాత ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.</p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 127 పరుగులతో అజేయంగా నిలిచింది. టీమ్ ను గెలిపించిన తర్వాత ఆమె కన్నీళ్లను ఆపుకోలేకపోయింది.

(AP)

3 / 9
<p>ఆస్ట్రేలియాలాంటి టీమ్ పై, అది కూడా 339 పరుగుల లక్ష్య ఛేదన ఊహకందనిదే. ఈ రికార్డు బ్రేకింగ్ చేజ్ తో ఇండియన్ టీమ్ వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. కప్పు కోసం సౌతాఫ్రికాతో తలపడనుంది. ఎవరు గెలిచినా ఈసారి ఓ కొత్త విజేత అవతరించనుంది.</p>(REUTERS) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

ఆస్ట్రేలియాలాంటి టీమ్ పై, అది కూడా 339 పరుగుల లక్ష్య ఛేదన ఊహకందనిదే. ఈ రికార్డు బ్రేకింగ్ చేజ్ తో ఇండియన్ టీమ్ వుమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. కప్పు కోసం సౌతాఫ్రికాతో తలపడనుంది. ఎవరు గెలిచినా ఈసారి ఓ కొత్త విజేత అవతరించనుంది.

(REUTERS)

4 / 9
<p>నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ సెమీఫైనల్లో ఇండియన్ వుమెన్స్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి ఈ రికార్డు చేజ్ చేసింది. అమన్‌జోత్ కౌర్ ఫోర్ కొట్టగానే స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకుల అరుపులతో మార్మోగిపోయింది.</p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ సెమీఫైనల్లో ఇండియన్ వుమెన్స్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి ఈ రికార్డు చేజ్ చేసింది. అమన్‌జోత్ కౌర్ ఫోర్ కొట్టగానే స్టేడియంలోని వేలాది మంది ప్రేక్షకుల అరుపులతో మార్మోగిపోయింది.

(AP)

5 / 9
<p>ఓపెనర్లు షెఫాలీ, స్మృతి విఫలమైనా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 88 బంతుల్లోనే 89 పరుగులు చేయడం, జెమీమాతో భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమ్ విజయం వైపు అడుగులు వేసింది.</p>(@BCCIWomen X) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

ఓపెనర్లు షెఫాలీ, స్మృతి విఫలమైనా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 88 బంతుల్లోనే 89 పరుగులు చేయడం, జెమీమాతో భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమ్ విజయం వైపు అడుగులు వేసింది.

(@BCCIWomen X)

6 / 9
<p>హర్మన్, జెమీమా కలిసి మూడో వికెట్ కు ఏకంగా 167 పరుగులు జోడించడంతో ఇండియన్ టీమ్ ఈ సంచలన విజయాన్ని అందుకుంది. మరో 9 బంతులు మిగిలి ఉండగానే 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.</p>(Raju Shinde) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

హర్మన్, జెమీమా కలిసి మూడో వికెట్ కు ఏకంగా 167 పరుగులు జోడించడంతో ఇండియన్ టీమ్ ఈ సంచలన విజయాన్ని అందుకుంది. మరో 9 బంతులు మిగిలి ఉండగానే 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.

(Raju Shinde)

7 / 9
<p>మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ తో 26 పరుగులు చేయడం కూడా టీమ్ కు కలిసి వచ్చింది. కీలకమైన సమయంలో హర్మన్, రిచా ఔటైనా జెమీమా మాత్రం చివరి వరకూ క్రీజులో నిలిచి అసాధ్యమనుకున్న విజయాన్ని అందించింది.</p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

మధ్యలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ తో 26 పరుగులు చేయడం కూడా టీమ్ కు కలిసి వచ్చింది. కీలకమైన సమయంలో హర్మన్, రిచా ఔటైనా జెమీమా మాత్రం చివరి వరకూ క్రీజులో నిలిచి అసాధ్యమనుకున్న విజయాన్ని అందించింది.

(AP)

8 / 9
<p>అంతకుముందు ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఓపెనర్ ఫోబె లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లోనే 119 పరుగులు చేసింది. </p>(HT_PRINT) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

అంతకుముందు ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఓపెనర్ ఫోబె లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లోనే 119 పరుగులు చేసింది.

(HT_PRINT)

9 / 9
<p>లిస్ పెర్రీ కూడా 88 బంతుల్లో 77 రన్స్ చేయడంతోపాటు లిచ్‌ఫీల్డ్ తో కలిసి రెండో వికెట్ కు 155 రన్స్ జోడించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.</p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Oct 31, 2025 06:50 am IST

లిస్ పెర్రీ కూడా 88 బంతుల్లో 77 రన్స్ చేయడంతోపాటు లిచ్‌ఫీల్డ్ తో కలిసి రెండో వికెట్ కు 155 రన్స్ జోడించడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది.

(PTI)

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!