నేటి నుంచే ప్రపంచ ఛాంపియన్ దక్షిణాఫ్రికాతో టెస్టు.. స్పిన్ బలంతో టీమిండియా.. లైవ్ ఎక్కడ చూడాలంటే? హెడ్ టు హెడ్ రికార్డు
సొంతగడ్డపై ప్రపంచ టెస్టు ఛాంపియన్ తో పోరుకు టీమిండియా సై అంటోంది. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ నేడే ప్రారంభమైంది. ఇవాళ తొలి టెస్టు స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ లో భారత్ స్పిన్ బలంతో బరిలో దిగింది.
స్వదేశంలో సఫారీ సవాల్ కు టీమిండియా సిద్దమైంది. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఫస్ట్ మ్యాచ్ ఈ రోజు (నవంబర్ 14) ఈడెన్ గార్డెన్స్ లో ప్రారంభమైంది.
(AP)
ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. ఆ టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది.
(AP)
సొంతగడ్డపై మరోసారి స్పిన్ బలంతో బరిలో దిగింది భారత్. ఈ టెస్టులో ఏకంగా నలుగురు స్పిన్నర్లను ఆడిస్తోంది. అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్; రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఈ టెస్టు ఆడుతున్నారు.
(AP)
కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, ధ్రువ్ జూరెల్ ప్రధాన బ్యాటర్లు. గాయం నుంచి కోలుకుని పంత్ రీ ఎంట్రీ ఇచ్చాడు. బుమ్రా, సిరాజ్ పేసర్లు. ఈ టెస్టును స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, జియోహాట్ స్టార్ లో చూడొచ్చు.
(Sudipta Banerjee)
ప్రస్తుతం దక్షిణాఫ్రికా ప్రపంచ టెస్టు ఛాంపియన్. ఓవరాల్ రికార్డు చూసుకున్నా సఫారీ టీమ్ దే పైచేయి. ఇప్పటివరకూ ఇండియా, సౌతాఫ్రికా 44 టెస్టులాడాయి. ఇందులో ఇండియా 16, దక్షిణాఫ్రికా 18 గెలిచాయి. 10 టెస్టులు డ్రాగా ముగిశాయి.
(AFP)
E-Paper

