Indiramma Indlu Hyderabad Scheme : పేదలకు శుభవార్త... సిటీలో రూ. 6 లక్షలకే ఇళ్లు - ఇవాళ్టి నుంచే దరఖాస్తులు ప్రారంభం

Published on Jul 21, 2026 10:19 am IST

Indiramma Indlu Hyderabad Scheme : హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలివిడతగా 16 నియోజకవర్గాల్లో 8 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.5 లక్షల ప్రభుత్వ సబ్సిడీతో లభించే ఈ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

1 / 6
<p>హైదరాబాద్ నివాసులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ అందించింది. క్యూర్ (CURE) పరిధిలోని నిరుపేదలు, అల్పదాయ వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడత కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8,000 ఇళ్లను నిర్మించనున్నారు. త్వరలోనే మరో 8 నియోజకవర్గాల్లో కూడా స్థలాలను గుర్తించి ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 21, 2026 10:19 am IST

హైదరాబాద్ నివాసులకు తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ అందించింది. క్యూర్ (CURE) పరిధిలోని నిరుపేదలు, అల్పదాయ వర్గాల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడత కింద 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున మొత్తం 8,000 ఇళ్లను నిర్మించనున్నారు. త్వరలోనే మరో 8 నియోజకవర్గాల్లో కూడా స్థలాలను గుర్తించి ఈ పథకాన్ని విస్తరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

2 / 6
<p>పేదలు నివసించే ప్రాంతాల్లోనే 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఈ ఇళ్లను రూపకల్పన చేశారు. ఈ స్థలాల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్థలాన్ని ఉచితంగా ఇంటి ఆడపడుచు పేరిట రిజిస్ట్రేషన్ చేసి అందిస్తారు. అయితే ఈ ఆస్తిని పదేళ్ల వరకు విక్రయించేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల వద్ద కుదువబెట్టి రుణం పొందే వెసులుబాటు మాత్రం కల్పించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 21, 2026 10:19 am IST

పేదలు నివసించే ప్రాంతాల్లోనే 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్ ఉండేలా ఈ ఇళ్లను రూపకల్పన చేశారు. ఈ స్థలాల మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.40 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటుందని మంత్రి తెలిపారు. లబ్ధిదారులకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ స్థలాన్ని ఉచితంగా ఇంటి ఆడపడుచు పేరిట రిజిస్ట్రేషన్ చేసి అందిస్తారు. అయితే ఈ ఆస్తిని పదేళ్ల వరకు విక్రయించేందుకు ఎలాంటి అవకాశం ఉండదు. అత్యవసర ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల వద్ద కుదువబెట్టి రుణం పొందే వెసులుబాటు మాత్రం కల్పించారు. ఇళ్ల కేటాయింపు ప్రక్రియలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

3 / 6
<p>ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం నేరుగా రూ.5 లక్షలను సబ్సిడీ రూపంలో ఉచితంగా అందిస్తోంది. మిగిలిన రూ.6 లక్షల వాటాను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. పేదలపై ఆర్థిక భారం పడకుండా ఈ రూ.6 లక్షలను నాలుగు వాయిదాల్లో (విడతల్లో) చెల్లించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్హులైన వాళ్లు… ఇవాళ్టి(జూలై 21) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 21, 2026 10:19 am IST

ఒక్కో ఇంటి నిర్మాణానికి సుమారు రూ.11 లక్షలు ఖర్చవుతుండగా, ప్రభుత్వం నేరుగా రూ.5 లక్షలను సబ్సిడీ రూపంలో ఉచితంగా అందిస్తోంది. మిగిలిన రూ.6 లక్షల వాటాను లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. పేదలపై ఆర్థిక భారం పడకుండా ఈ రూ.6 లక్షలను నాలుగు వాయిదాల్లో (విడతల్లో) చెల్లించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్హులైన వాళ్లు… ఇవాళ్టి(జూలై 21) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

4 / 6
<p>దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల దరఖాస్తు తిరస్కరణకు గురై ఇల్లు మంజూరు కాకపోతే, ఆ రూ.10,000 లను ఖాతాదారులకు తిరిగి రీఫండ్ చేస్తారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు వారు చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తంలో ఈ రూ.10,000 లను మినహాయిస్తారు.అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. మీసేవ కేంద్రాల ద్వారా లేదా</p><p>వాట్సాప్ ద్వారా (నెంబర్: 8096958096) కూడా అప్లికేషన్ సమర్పించవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 21, 2026 10:19 am IST

దరఖాస్తు సమయంలో అభ్యర్థులు రూ.10,000 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల దరఖాస్తు తిరస్కరణకు గురై ఇల్లు మంజూరు కాకపోతే, ఆ రూ.10,000 లను ఖాతాదారులకు తిరిగి రీఫండ్ చేస్తారు. ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు వారు చెల్లించాల్సిన రూ.6 లక్షల మొత్తంలో ఈ రూ.10,000 లను మినహాయిస్తారు.అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 10వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. మీసేవ కేంద్రాల ద్వారా లేదా

వాట్సాప్ ద్వారా (నెంబర్: 8096958096) కూడా అప్లికేషన్ సమర్పించవచ్చు.

5 / 6
<p>అభ్యర్థులు తమ స్వంత నియోజకవర్గ పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. దరఖాస్తుదారుడి పేరిట క్యూర్ పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు లేదా ఖాళీ స్థలం ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి కేవలం ఒక దరఖాస్తును మాత్రమే స్వీకరిస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 21, 2026 10:19 am IST

అభ్యర్థులు తమ స్వంత నియోజకవర్గ పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షలకు మించకూడదు. దరఖాస్తుదారుడి పేరిట క్యూర్ పరిధిలో ఎలాంటి సొంత ఇల్లు లేదా ఖాళీ స్థలం ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి కేవలం ఒక దరఖాస్తును మాత్రమే స్వీకరిస్తారు.

6 / 6
<p>అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేసేందుకు 360 డిగ్రీల విస్తృత స్థాయి వడపోత ప్రక్రియను నిర్వహిస్తారు. నియోజకవర్గానికి కేటాయించిన 500 ఇళ్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అందరి సమక్షంలో బహిరంగంగా లాటరీ తీసి విజేతలను ఎంపిక చేస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి, రాజకీయాలకు అతీతంగా స్థలాలను ఎంపిక చేసినట్లు మంత్రి వివరించారు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 21, 2026 10:19 am IST

అర్హులైన వారిని మాత్రమే ఎంపిక చేసేందుకు 360 డిగ్రీల విస్తృత స్థాయి వడపోత ప్రక్రియను నిర్వహిస్తారు. నియోజకవర్గానికి కేటాయించిన 500 ఇళ్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే, ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అందరి సమక్షంలో బహిరంగంగా లాటరీ తీసి విజేతలను ఎంపిక చేస్తారు. స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి, రాజకీయాలకు అతీతంగా స్థలాలను ఎంపిక చేసినట్లు మంత్రి వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!