భారీగా పడిపోతున్నఉష్ణోగ్రతలు - తెలంగాణలో వణికిస్తున్న చలి
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వర్షాలు లేకపోవటంతో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు కురుస్తుండగా… రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వర్షాలు లేకపోవటంతో పూర్తిగా పొడి వాతావరణం ఉంటుంది. ఉదయం సమయంలో పొగ మంచు కురుస్తుండగా… రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.
తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… ఆదిలాబాద్ జిల్లా బేలలో అతితక్కువగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, రంగారెడ్డి జిల్లాలోని షాబాద్లో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
ఇక సంగారెడ్డిలోని జహీరాబాద్లో 14.8, శంకర్పల్లి 14.9, మొయినాబాద్ 15 డిగ్రీలు, ఆదిలాబాద్లోని భీమ్పూర్ 15, సంగారెడ్డిలోని జిన్నారంలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
మరోవైపు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాజేంద్రనగర్లో 15.3, హెచ్సీయూలో 15.3, బీహెచ్ఈఎల్ 15.5, మల్కాజిగిరి 15.7, కుత్బుల్లాపూర్ 15.7, గచ్చిబౌలి 15.9, మారేడ్పల్లి 16, ఆర్సీపురం 16.1, బేగంపేట 16.4, నేరేడ్మెట్ 17.1, అల్వాల్ 17.1, కార్వాన్ లో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు తెలంగాణకు ఎలాంటి వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.
E-Paper

