RCB vs GT : ఆర్సీబీకి రూ. 20కోట్లు, జీటీకి రూ. 12.5కోట్లు- SRH టీమ్కి ప్రైజ్ మనీ ఎంతంటే…
IPL 2026 : దేశంలో ఐపీఎల్ మహా సమరం ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి ట్రోఫీని దక్కించుకుంది. మరీ విన్నర్గా ఆర్సీబీకి, రన్నరప్గా జీటీకి, ఎలిమినేటర్లో ఓడిపోయిన ఎస్ఆర్హెచ్కి ప్రైజ్ మనీ ఎంత దక్కిందో ఇక్కడ తెలుసుకోండి..
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ రికార్డులు సృష్టించడమే కాకుండా భారీ ప్రైజ్ మనీని సైతం దక్కించుకుంది.
ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టుకు ఏకంగా రూ. 20 కోట్ల నగదు బహుమతి లభించింది. రన్నరప్గా నిలిచిన శుభ్మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు రూ. 12.5 కోట్లు దక్కాయి.
ప్లేఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ కూడా కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందుకున్నాయి. ఆర్ఆర్కి రూ. 7కోట్లు, ఎస్ఆర్హెచ్కి 6.5కోట్లు లభించాయి.
విన్నర్ ప్రైజ్ మనీ చూస్తే చాలు.. ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన లీగ్ అని తెలిసిపోతుంది. ఉదాహరణకు ఐపీఎల్ విన్నర్కి రూ. 20కోట్ల ప్రైజ్ మనీ వస్తుండగా, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్లో అది కేవలం రూ. 4.5కోట్లే!
E-Paper

