MS Dhoni : ఎంఎస్ ధోనీ ఎక్కడ? ఎప్పుడు ఆడతాడు? సీఎస్కే కెప్టెన్ బిగ్ అప్డేట్..
ఐపీఎల్ 2026 ప్రారంభమై రెండు వారాలు గడిచిపోయింది. ఇప్పుడు అందరి చూపు ఎంఎస్ ధోనీవైపే ఉంది. గాయం కారణంగా ధోనీ ఆడకపోవడం ఫ్యాన్స్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ‘ధోనీ ఎప్పుడు ఆడతాడు?’ అని సీఎస్కేతో పాటు ధోనీ అభిమానులు అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆన్సర్ ఇచ్చేశాడు.
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా శనివారం దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ‘ధోనీ ఎక్కడ?’ అని టాస్ సమయంలో రవిశాస్త్రి గైక్వాడ్ని అడిగాడు.
(PTI)
"ఎంఎస్ ధోనీ గురించి అడుగుతున్న వారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఆయన ప్రస్తుతం హోటల్లో ఉండి జట్టుకు మద్దతిస్తున్నారు. కానీ కచ్చితంగా చాలా త్వరలోనే ఆయన్ని మీరు మైదానంలో చూస్తారు," అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పాడు. ఫలితంగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్లో ఉన్నారు.
(PTI)
పిక్క కండరాల గాయం కారణంగా ధోనీ కొన్ని మ్యాచ్లకు దూరమవుతాడని సీఎస్కే యాజమాన్యం ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ప్రకటించిన సంగతి తెలిసిందే
(PTI)
టీమిండియాకు ధోనీ గుడ్బై చెప్పేసి చాలా సంవత్సరాలైంది. కేవలం ఐపీఎల్ ఆడుతూ ఫ్యాన్స్ని అలరిస్తున్నాడు. అయితే ధోనీ ఐపీఎల్ కెరీర్ కూడా చివరి దశలో ఉందని చాలా మంది భావిస్తున్నారు. అందుకే ధోనీని చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. కానీ ధోనీ గాయం వార్త అందరిని బాధపెట్టింది.
(PTI)
శనివారం డీసీపై గెలిచి ఐపీఎల్ 2026లో ఖాతా ఓపెన్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్. ఏప్రిల్ 14న కేకేఆర్తో తలపడనుంది. ఆ మ్యాచ్కి ధోనీ అందుబాటులోకి వస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి
(PTI)
E-Paper

