తెలుగు రాష్ట్రాల నుంచి IRCTC భారత్ గౌరవ్ ట్రైన్ టూర్ ప్యాకేజీ - గుజరాత్ లోని ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు..! ఇవిగో వివరాలు
తెలుగు రాష్ట్రాల నుంచి ఐఆర్సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ‘భవ్య గుజరాత్’ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. గుజరాత్లోని పలు అధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేసేలా ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలనే తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం ఐఆర్సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ‘భవ్య గుజరాత్’ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను తాజాగానే ప్రకటించింది.
భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా ‘భవ్య గుజరాత్’ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది. గుజరాత్లోని పలు అధ్యాత్మిక ప్రదేశాలను కవర్ చేసేలా ఈ ప్యాకేజీని రూపొందించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయల్దేరుతుంది.
ఈ ప్యాకేజీ 9 రాత్రులు / 10 రోజులు ఉంటుంది. ఈ రైలు 2025 అక్టోబర్ 27న సికింద్రాబాద్ ఉదయం 8 గంటలకు, నిజామాబాద్ కు ఉదయం 11:30 గంటలకు, నాందేడ్ కు మధ్యాహ్నం 02:00 గంటలకు, పూర్ణా జంక్షన్ కు మధ్యాహ్నం 02:50 గంటలకు చేరుకుంటుందని అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
సందర్శించే ప్రాంతాలు : ద్వారకాలోని ద్వారకాధీశ్ ఆలయం, నాగేశ్వర ఆలయం, బేట్ ద్వారకాను సందర్శిస్తారు. ఇక సోమనాథ్ లోని సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమం, మోడేరా సూర్యదేవాలయం (మోడేరా), రాణి కి వావ్ (పటాన్)ను చూస్తారు. ఎకతా నగర్ లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శిస్తారు.
రేణిగుంట నుంచి షురూ అయ్యే ఈ ప్రయాణం…. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ, ఖమ్మం, కాజీపేట్, సికింద్రాబాద్ జంక్షన్, నిజామాబాద్ జంక్షన్, హజూర్ సాహెబ్ నాందేడ్, పూర్ణా జంక్షన్ మీదుగా సాగుతుంది. ఆయా స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు.
ఈ ప్యాకేజీ ధరలు చూస్తే ఎకామనీ(ఎస్ఎల్) రూ.18,400, స్టాండర్డ్ (3AC) లో అయితే రూ. 30,200, కంఫర్ట్ (2ఏసీ)లో అయితే రూ.39,900గా ఉంటుంది. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలుంటాయి. ఏసీ, నాన్ ఏసీ రూమ్ లు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ తో పాటు పూర్తి వివరాల కోసం www.irctctourism.com వెబ్ సైట్ ను చూడాలి. ఇక
9701360701, 9281030749, 9281030750, 9281495843 నంబర్లను కూడా సంప్రదించవచ్చు.
E-Paper

