జాన్వీ స్వరూప్ ఫొటోలు చూశారా.. ఘట్టమనేని వంశం అందంతో మెరిసిపోతున్న మహేష్ బాబు మేనకోడలు
టాలీవుడ్లోకి ఘట్టమనేని వంశం నుంచి మరో వారసురాలు వచ్చేస్తోంది. మహేష్ బాబు మేనకోడలు, అతని అక్క మంజుల కూతురు జాన్వీ స్వరూప్ తెరంగేట్రానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మంజుల షేర్ చేసిన జాన్వీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఘట్టమనేని వంశం నుంచి వచ్చిన వాళ్లంతా మంచి అందగాళ్లే. కృష్ణ అయినా, మహేష్ బాబు అయినా చుక్కల్లో చంద్రుడిలా తెరపై కనిపించి కనువిందు చేస్తారు. ఇప్పుడదే వంశానికి చెందిన జాన్వీ స్వరూప్ తెరంగేట్రం చేయబోతోంది.
ఘట్టమనేని వంశం అందాన్ని పుణికిపుచ్చుకున్నట్లుగా జాన్వీ స్వరూప్ కనిపిస్తోంది. ఈమె నటి ఘట్టమనేని మంజుల కూతురు కావడం విశేషం.
బుధవారం (అక్టోబర్ 29) జాన్వీ స్వరూప్ పుట్టిన రోజు సందర్భంగా మంజుల తన ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫొటోలను షేర్ చేసింది.
ఇప్పటి వరకూ బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని జాన్వీ.. ఇంత అందంగా ఉందా అంటూ ఈ ఫొటోలు చూసిన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఘట్టమనేని నట వారసురాలిని స్క్రీన్ పై చూడటానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆమె సినిమాకు సంబంధించిన వివరాలు బయటకు రావాల్సి ఉంది.
జాన్వీ స్వరూప్ కు ఇన్స్టాగ్రామ్ లో అకౌంట్ ఉన్నా పెద్దగా యాక్టివ్ గా లేదు. ఇద్దరు మాత్రమే ఫాలోవర్లు ఉన్నారు. మరి రానున్న రోజుల్లో తొలి సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారే అవకాశాలు ఉన్నాయి.
E-Paper

