Karimnagar Railway Station : ఆధునిక హంగులతో కరీంనగర్ రైల్వేస్టేషన్ - ఈ ఫొటోలు చూడండి
“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. 100 శాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించింది.
ఆధునీకరణ పనులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకుంది.
రూ.25.85 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు.
ఆధునీకరణ పనులు వంద శాతం పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా… 12 మీటర్ల పూట్ ఓవర్ బ్రిడ్జి, న్యూ కవర్ ఫ్లాట్ ఫామ్, స్టేషన్ బిల్డింగ్, బుకింగ్ ఆఫీస్ పూర్తి చేశారు.
మోడ్రన్ టాయిలెట్స్, దివ్యాంగులకు ప్రత్యేక వసతులు, ఎస్కులేటర్లు, లిఫ్ట్స్ నిర్మాణం చేశారు. ల్యాండ్ స్కేప్ తో పాటు లైటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.
ఆధునిక వసుతలతో టికెట్ బుకింగ్ కౌంటర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా ఒక్క కరీంనగర్ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు… పలు స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. చాలా చోట్ల 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా.. మరికొన్ని త్వరలోనే అందుబాటులోకి వస్తాయి.
E-Paper

