ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ అప్డేట్ - ఏప్రిల్ లో రెండో విడత ఇళ్ల పంపిణీ
త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ రెండో విడత కార్యక్రమం షురూ కానుంది. ఇదే విషయంపై తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు.
త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ రెండో విడత కార్యక్రమం షురూ కానుంది. ఇదే విషయంపై తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు.
శనివారం ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… ఇందిరమ్మ ఇళ్ల విషయంలో గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా కేవలం అర్హతే ప్రాతిపదికగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని చెప్పారు.
రాబోయే ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా రాబోయే మూడేళ్ల కాలంలో సొంత స్థలం ఉండి ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జోడుడ్లవలె నడుస్తోందని మంత్రి పొంగులేటి చెప్పారు. మహాలక్ష్మి కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలందిస్తున్నామని వివరించారు.
మరోవైపు రాష్ట్రంలో మొదటి విడత కింద మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల పనులు పూర్తి కావొస్తున్నాయి. చాలా చోట్ల గృహ ప్రవేశాలు జరుగుతున్నాయి.నిర్మాణ దశను బట్టి నిధులను లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేస్తున్నారు.
E-Paper

