వెదర్ రిపోర్ట్ : ఏపీకి తేలికపాటి వర్ష సూచన - తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత..!

Published on Nov 09, 2025 09:53 am IST

ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ద్రోణి ప్రభావంతో ఇవాళ,రేపు తేలికపాటి నుంచి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో పూర్తిగా పొడి వాతావరణం ఉండనుంది.

1 / 6
<p>ఏపీకి ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందన పేర్కొంది. అదేవిధంగా దిగువన ట్రోపోస్థాయిలో ఉత్తర -ఈశాన్య గాలులు వీస్తుండటంతో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 09, 2025 09:53 am IST

ఏపీకి ఐఎండీ వర్ష సూచన ఇచ్చింది. నైరుతి బంగాళాఖాతం నుంచి కేరళ వరకు శ్రీలంక – తమిళనాడు మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందన పేర్కొంది. అదేవిధంగా దిగువన ట్రోపోస్థాయిలో ఉత్తర -ఈశాన్య గాలులు వీస్తుండటంతో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించింది.

2 / 6
<p>ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 09, 2025 09:53 am IST

ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

3 / 6
<p>ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సోమవారం(నవంబర్ 10) వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు. </p>(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Nov 09, 2025 09:53 am IST

ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సోమవారం(నవంబర్ 10) వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు.

(image source @APSDMA)

4 / 6
<p>మరోవైపు తెలంగాణలో వర్షాలు తగ్గిపోగా… చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అంచనా వేసింది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 09, 2025 09:53 am IST

మరోవైపు తెలంగాణలో వర్షాలు తగ్గిపోగా… చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో పూర్తిగా పొడి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం అంచనా వేసింది.

5 / 6
<p>ఇక నవంబర్ 10 నుంచి తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. </p>(image source @APSDMA X) expand-icon View Photos in a new improved layout
Published on Nov 09, 2025 09:53 am IST

ఇక నవంబర్ 10 నుంచి తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

(image source @APSDMA X)

6 / 6
<p>ఇక హైదరాబాద్ సిటీలో కూడా చలి ఎక్కువగా ఉంటోంది. ఉదయం పలుచోట్ల పొగమంచు కురిసే పరిస్థితులు ఉంటున్నాయి. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. </p>(AFP File ) expand-icon View Photos in a new improved layout
Published on Nov 09, 2025 09:53 am IST

ఇక హైదరాబాద్ సిటీలో కూడా చలి ఎక్కువగా ఉంటోంది. ఉదయం పలుచోట్ల పొగమంచు కురిసే పరిస్థితులు ఉంటున్నాయి. చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

(AFP File )

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!