ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఇక తేలికపాటి వర్షాలే - ఐఎండీ అంచనాలు ఇలా
వర్షాలపై ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. ఐఎండీ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. మొంథా తుఫాన్ దాటికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు జిల్లాల్లో తీవ్రమైన నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలు తేలుకుంటున్నాయి.
మరోవైపు వర్షాలపై వాతావరణ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.
(HT PHOTO)
ఈ వారమంతా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ వర్ష సూచనలు లేవని… ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని వివరించింది.
(AFP File )
ఇక ఏపీలో శనివారం(01-11-2025) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.
(PTI)
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. క్రమంగా ప్రవాహం తగ్గే అవకాశం ఉంది.
కృష్ణా, పెన్నా, ఇతర ఉపనదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.
(image source @APSDMA)
E-Paper

