ఏపీ - తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఇక తేలికపాటి వర్షాలే - ఐఎండీ అంచనాలు ఇలా

Published on Nov 01, 2025 07:08 am IST

వర్షాలపై ఐఎండీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. ఐఎండీ అప్డేట్స్ ఇక్కడ చూడండి…

1 / 6
<p>గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. మొంథా తుఫాన్ దాటికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు జిల్లాల్లో తీవ్రమైన నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలు తేలుకుంటున్నాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 01, 2025 07:08 am IST

గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టాయి. మొంథా తుఫాన్ దాటికి వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు జిల్లాల్లో తీవ్రమైన నష్టం కూడా వాటిల్లింది. ఇప్పుడిప్పుడే వరద ప్రభావిత ప్రాంతాలు తేలుకుంటున్నాయి.

2 / 6
<p> మరోవైపు వర్షాలపై వాతావరణ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.</p>(HT PHOTO) expand-icon View Photos in a new improved layout
Published on Nov 01, 2025 07:08 am IST

మరోవైపు వర్షాలపై వాతావరణ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నాలుగైదు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉందని పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేవని తెలిపింది.

(HT PHOTO)

3 / 6
<p>ఈ వారమంతా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ వర్ష సూచనలు లేవని… ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని వివరించింది. </p>(AFP File ) expand-icon View Photos in a new improved layout
Published on Nov 01, 2025 07:08 am IST

ఈ వారమంతా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు మాత్రమే పడే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. భారీ వర్ష సూచనలు లేవని… ఎలాంటి హెచ్చరికలు కూడా లేవని వివరించింది.

(AFP File )

4 / 6
<p>ఇక ఏపీలో శనివారం(01-11-2025) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది. </p>(PTI) expand-icon View Photos in a new improved layout
Published on Nov 01, 2025 07:08 am IST

ఇక ఏపీలో శనివారం(01-11-2025) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించింది.

(PTI)

5 / 6
<p>ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. క్రమంగా ప్రవాహం తగ్గే అవకాశం ఉంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 01, 2025 07:08 am IST

ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,56,400 క్యూసెక్కులు ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. క్రమంగా ప్రవాహం తగ్గే అవకాశం ఉంది.

6 / 6
<p>కృష్ణా, పెన్నా, ఇతర ఉపనదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.</p>(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on Nov 01, 2025 07:08 am IST

కృష్ణా, పెన్నా, ఇతర ఉపనదుల పరీవాహక లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ అధికారులు సూచించారు. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని హెచ్చరించారు.

(image source @APSDMA)

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!