ఐఎండీ వెదర్ రిపోర్ట్ : ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు - పలు ప్రాంతాల్లో పిడుగులు పడే ఛాన్స్...!
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఎలాంటి హెచ్చరికలు లేవని పేర్కొంది.
ఏపీలో ఇవాళ(నవంబర్ 2, 2025) బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఓ ప్రకటన ద్వారా వివరించింది.
ఏపీలోని కొన్నిచోట్ల అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచలున్నాయి. అయితే ఇలా కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని అధికారులు సూచించారు.
ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ప్రవాహం కొన్ని రోజులు హెచ్చతగ్గులుగా ఉండే అవకాశం ఉందని. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్న చోట్ల వాగులు, కాల్వలు దాటరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇక తెలంగాణలో చూస్తే కొన్నిరోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది. ఇక హైదరాబాద్ లో ఇవాళ ఉదయం, రాత్రి వేళలో పొగమంచు కురిసే అవకాశం ఉంది.
E-Paper

