Low energy levels : ఎప్పుడూ నీరసంగా, ఎనర్జీ లేనట్టే ఉంటోందా? ఈ 5 ఆహారాలు, డ్రింక్సే కారణం!

Published on May 05, 2026 11:18 am IST

Low energy level foods : ఉదయం లేవగానే ఎంతో ఉత్సాహంగా పని మొదలుపెడతాం, కానీ మధ్యాహ్నం అయ్యేసరికి తెలియని నీరసం ఆవహిస్తుంది. దీనికి ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారమే అని మీకు తెలుసా? ఆరోగ్యకరమైనవి అనుకుని మనం తినే కొన్ని పదార్థాలు మన శరీరంలోని ఎనర్జీని నిశ్శబ్దంగా హరించేస్తాయని నిపుణులు. అవేంటంటే..

1 / 6
<p><strong>అతిగా కెఫిన్ తీసుకోవడం:</strong> కాఫీ, టీలు తాగినప్పుడు అందులోని కెఫిన్ మనల్ని అప్పటికప్పుడు అలర్ట్​గా ఉంచుతుంది. కానీ, పదేపదే వీటిపై ఆధారపడటం వల్ల శరీర సహజ సిద్ధమైన ఎనర్జీ సైకిల్ దెబ్బతింటుందట. ఇది క్రమంగా అలసటను పెంచి, శరీరాన్ని మరింత నీరసపరుస్తుంది. ఏదైనా మితంగా తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని గుర్తుంచుకోవాలి.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 05, 2026 11:18 am IST

అతిగా కెఫిన్ తీసుకోవడం: కాఫీ, టీలు తాగినప్పుడు అందులోని కెఫిన్ మనల్ని అప్పటికప్పుడు అలర్ట్​గా ఉంచుతుంది. కానీ, పదేపదే వీటిపై ఆధారపడటం వల్ల శరీర సహజ సిద్ధమైన ఎనర్జీ సైకిల్ దెబ్బతింటుందట. ఇది క్రమంగా అలసటను పెంచి, శరీరాన్ని మరింత నీరసపరుస్తుంది. ఏదైనా మితంగా తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందని గుర్తుంచుకోవాలి.

2 / 6
<p><strong>పండ్ల రసాలు (ఫ్రూట్ జ్యూస్):</strong> పండ్ల రసం తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరూ భావిస్తారు. అయితే, పండును నేరుగా తిన్నప్పుడు లభించే పీచు పదార్థం (ఫైబర్) జ్యూస్‌లో ఉండదు. దీనివల్ల పండ్లలోని చక్కెర నేరుగా రక్తంలో కలిసి ఒక్కసారిగా ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. ఆ తర్వాత అంతే వేగంగా ఆ స్థాయిలు పడిపోవడంతో మీరు తీవ్రమైన అలసటకు గురవుతారు. కాబట్టి జ్యూస్‌లకు బదులు నేరుగా పండ్లను తినడం ఉత్తమం.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 05, 2026 11:18 am IST

పండ్ల రసాలు (ఫ్రూట్ జ్యూస్): పండ్ల రసం తాగడం ఆరోగ్యానికి మంచిదని అందరూ భావిస్తారు. అయితే, పండును నేరుగా తిన్నప్పుడు లభించే పీచు పదార్థం (ఫైబర్) జ్యూస్‌లో ఉండదు. దీనివల్ల పండ్లలోని చక్కెర నేరుగా రక్తంలో కలిసి ఒక్కసారిగా ఎనర్జీ లెవల్స్‌ను పెంచుతుంది. ఆ తర్వాత అంతే వేగంగా ఆ స్థాయిలు పడిపోవడంతో మీరు తీవ్రమైన అలసటకు గురవుతారు. కాబట్టి జ్యూస్‌లకు బదులు నేరుగా పండ్లను తినడం ఉత్తమం.

3 / 6
<p><strong>షుగర్-ఫ్రీ ఎనర్జీ డ్రింక్స్:</strong> చక్కెర లేదని ప్రచారం చేసుకునే ఎనర్జీ డ్రింక్స్‌లో కృత్రిమ తీపి పదార్థాలు, స్టిమ్యులెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ నిద్రను, మెటబాలిజాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి తాత్కాలికంగా బూస్ట్ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత శరీరంలో ఒక రకమైన అశాంతిని, నీరసాన్ని కలిగిస్తాయి. సహజ సిద్ధమైన పానీయాలే శరీరానికి మేలు చేస్తాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 05, 2026 11:18 am IST

షుగర్-ఫ్రీ ఎనర్జీ డ్రింక్స్: చక్కెర లేదని ప్రచారం చేసుకునే ఎనర్జీ డ్రింక్స్‌లో కృత్రిమ తీపి పదార్థాలు, స్టిమ్యులెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ నిద్రను, మెటబాలిజాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి తాత్కాలికంగా బూస్ట్ ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత శరీరంలో ఒక రకమైన అశాంతిని, నీరసాన్ని కలిగిస్తాయి. సహజ సిద్ధమైన పానీయాలే శరీరానికి మేలు చేస్తాయి.

4 / 6
<p><strong>బిస్కెట్లు:</strong> చిన్న ఆకలి వేసినప్పుడు మనం వెంటనే బిస్కెట్లు తింటుంటాం. ఇవి మైదా, పంచదారతో తయారవుతాయి. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచి, అంతే వేగంగా తగ్గించేస్తాయి. దీనివల్ల శరీరానికి అందే శక్తి నిలకడగా ఉండదు. ఫలితంగా కొద్దిసేపటికే మళ్లీ నీరసంగా అనిపిస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 05, 2026 11:18 am IST

బిస్కెట్లు: చిన్న ఆకలి వేసినప్పుడు మనం వెంటనే బిస్కెట్లు తింటుంటాం. ఇవి మైదా, పంచదారతో తయారవుతాయి. ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచి, అంతే వేగంగా తగ్గించేస్తాయి. దీనివల్ల శరీరానికి అందే శక్తి నిలకడగా ఉండదు. ఫలితంగా కొద్దిసేపటికే మళ్లీ నీరసంగా అనిపిస్తుంది.

5 / 6
<p><strong>భారీ భోజనం (క్రీమీ పాస్తా లేదా వైట్ రైస్):</strong> ఎక్కువగా ప్రాసెస్ చేసిన తెల్ల బియ్యం లేదా క్రీమీ పాస్తా వంటి ఆహారాలు జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. దీనివల్ల భోజనం చేసిన తర్వాత మగతగా, నిద్రగా అనిపిస్తుంది. వీటిలో పీచు, ప్రోటీన్లు తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. తేలికపాటి భోజనం చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 05, 2026 11:18 am IST

భారీ భోజనం (క్రీమీ పాస్తా లేదా వైట్ రైస్): ఎక్కువగా ప్రాసెస్ చేసిన తెల్ల బియ్యం లేదా క్రీమీ పాస్తా వంటి ఆహారాలు జీర్ణం కావడానికి శరీరం ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి ఉంటుంది. దీనివల్ల భోజనం చేసిన తర్వాత మగతగా, నిద్రగా అనిపిస్తుంది. వీటిలో పీచు, ప్రోటీన్లు తక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. తేలికపాటి భోజనం చేయడం వల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండవచ్చు.

6 / 6
<p>వీటిని పూర్తిగా మానేయకపోయినా, వీటిని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మీ శక్తి సామర్థ్యాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 05, 2026 11:18 am IST

వీటిని పూర్తిగా మానేయకపోయినా, వీటిని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మీ శక్తి సామర్థ్యాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!