అందంగా ఉన్నందుకే హీరోయిన్గా రెజెక్ట్- 400 కోట్ల సంపాదన- మహేశ్ బాబు, ప్రభాస్, నాగ చైతన్యతో నటించిన ఈ హీరోయిన్ ఎవరంటే?
ఈ బ్యూటిపుల్ హీరోయిన్ అందంగా ఉండటం వల్లే చాలా సినిమాల్లో తిరస్కరించారట. ఇప్పుడు ఈ బ్యూటీ సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ నడుపుతూ కోట్ల నెట్వర్త్ను సంపాదిస్తోంది. అంతేకాకుండా తెలుగులో ఈ ముద్దుగుమ్మ మహేశ్ బాబు, నాక చైతన్య, ప్రభాస్తో కలిసి హీరోయిన్గా చేసింది. మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా?
బాలీవుడ్ హీరోయిన్- బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ నేపథ్యం లేనప్పటికీ సినిమాల్లో అద్భుతమైన నటన చూపించే నటులు చాలా మంది ఉన్నారు. వారిలో ఒక టాలెంటెడ్ హీరోయిన్ గురించే మనం చెప్పుకునేది. ఆమె హీరోయిన్గానే కాకుండా సొంతంగా స్కిన్ కేర్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేసింది.
(instagram)
కృతి సనన్- మనం మాట్లాడుతున్న బ్యూటిఫుల్ ఎవరో కాదు కృతి సనన్. అయితే ఈ ముద్దుగుమ్మ అందంగా ఉండి మంచి లుక్స్ కారణంగా తన కెరీర్లో చాలా రెజెక్షన్స్ ఎదుర్కొందట. కానీ, నేడు ఈ భామ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న పెద్ద బ్యూటీ బ్రాండ్ను కలిగి ఉంది.
(instagram)
న్యూస్ 18తో కృతి సనన్ మాట్లాడుతూ.. “నన్ను చాలాసార్లు అందంగా ఉండటం వల్ల రెజెక్ట్ చేశారు. కానీ, వారు ఎలా చెప్పేవారంటే మీరు చూడటానికి చాలా బాగున్నారు. అదే నాకు పెద్ద సవాలు అనేవారు” అని చెప్పింది.
(instagram)
కృతి బ్యూటీ బ్రాండ్- అయితే కృతి సనన్ను రెజెక్ట్ చేసిన సినిమాలు మాత్రం చెప్పలేదు. ఇదిలా ఉంటే, హీరోయిన్గా రెజెక్ట్ అయిన కృతి సనన్ బాలీవుడ్లో తనకంటూ ఒక సముచిత స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తరువాత బ్యూటీ బ్రాండ్ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. హైఫెన్ అనే తన సొంత చర్మ సంరక్షణ బ్రాండ్ను స్టార్ట్ చేసింది కృతి.
(instagram)
మొదటి సంవత్సరంలో సంపాదించింది– కృతి సనన్ ఈ బ్రాండ్ను 2023 సంవత్సరంలో PEP టెక్నాలజీస్తో ప్రారంభించింది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ఈ బ్రాండ్ మొదటి ఏడాదిలో రూ. 100 కోట్లు సంపాదించింది.
(instagram)
లైవ్ మింట్ నివేదిక ప్రకారం 2025 నాటికి కృతి సనన్ స్కిన్ కేర్ బ్రాండ్ అమ్మకాలు రూ. 400 కోట్లకు చేరుకున్నాయి.
(instagram)
కృతి సనన్ సినిమాలు- ఇవే కాకుండా కృతి సనన్ సినిమాల్లో కూడా బెస్ట్గా రాణిస్తోంది. ఆమె ద్విపాత్రాభినయం చేసిన దో పత్తీ సినిమా బాగా ఆకట్టుకుంది.
(instagram)
మహేశ్ బాబు, ప్రభాస్, నాగ చైతన్యతో- ఇప్పుడు కృతి సనన్ తెరే ఇష్క్ మే, కాక్టేయిల్ 2 చిత్రాల్లో కనిపించబోతోంది. తేరే ఇష్క్లో ధనుష్ సరసన ప్రధాన పాత్రలో నటిస్తున్న కృతి సనన్ కాక్టేయిల్ 2లో షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి కనిపించనుంది. ఇకపోతే తెలుగులో మహేశ్ బాబు వన్ నేనొక్కడినే, నాగ చైతన్య దోచేయ్, ప్రభాస్తో ఆదిపురుష్ సినిమాల్లో కృతి సనన్ నటించిన విషయం తెలిసిందే.
(instagram)
E-Paper

