మంగళగిరి రైల్వేస్టేషన్ లుక్ మారిపోయింది - ఈ కొత్త ఫొటోలు చూడండి
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తయ్యాయి. తాజా ఫొటోలు ఇక్కడ చూడండి…..
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలోని మంగళగిరి రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తయ్యాయి.
ఎయిర్ పోర్టుల తరహాలో మంగళగిరి రైల్వే స్టేషన్ లుక్ కనిపిస్తోంది. అత్యాధునిక సౌకర్యాలు త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. సర్క్యులేటింగ్ ఏరియా, పార్కింగ్, రియర్ సైడ్ బిల్డింగ్, వీఐపీ లాంజ్ పనులు పూర్తి అయినట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
ప్రస్తుతం ప్లాట్ఫాం సర్ఫేసింగ్, దివ్యాంగుల సౌకర్యాలు, ఫెకేడ్ పనులు కొనసాగుతున్నాయని రైల్వేశాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది.
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే మంగళగిరి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నారు. మరో 5 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
మంగళగిరి రైల్వే స్టేషన్ ముందు చేనేత కార్మికురాలు మగ్గం నేస్తున్నట్లు ఏర్పాటు చేసిన విగ్రహం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధునీకరించిన వసతులతో కూడిన ఈ రైల్వే స్టేషన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
E-Paper

