సరికొత్త లుక్ లో మేడ్చల్ రైల్వే స్టేషన్ - ఈ ఫొటోలు చూడండి
“ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా మేడ్చల్ రైల్వే స్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం 83 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 17 శాతం పనులను త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు.
ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని మేడ్చల్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది.
ఆధునీకరణ పనులతో నల్గొండ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.32.11 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టారు. ఇప్పటివరకు 83 శాతం పనులు పూర్తయ్యాయి.ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. పనుల వివరాలను వెల్లడించారు,
వెయిటింగ్ హాల్, బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్, ప్లంబింగ్, ఫ్లాట్ ఫామ్ సర్ ఫేస్ పనులు పూర్తయ్యాయి. అంతేకాకుండా పార్కింగ్ షెడ్యూస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఆధునాత టాయిలెట్స్ పనులను ముగించారు.
కొన్నిచోట్ల ఇంటీరియర్ పనులు, వెయిటింగ్ బిల్డింగ్, ఫ్లాట్ ఫారమ్ 2,3,4,5 లో కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ పనులను కూడా పూర్తి చేయనున్నారు.
కొన్ని ఫ్లాట్ ఫామ్స్ లో పనులన్నీ పూర్తయ్యాయి. మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేసి…. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా రైల్వే శాఖ అధికారులు పని చేస్తున్నారు.
E-Paper

