ఫుట్​బాల్​ పట్టకుండానే వెళ్లిపోయిన మెస్సీ- స్టేడియంలో ఫ్యాన్స్​ విధ్వంసం..

Published on Dec 13, 2025 01:14 pm IST

కోల్​కతాలో తమ అభిమాన ఫుట్​బాల్​ ప్లేయర్​ మెస్సీని చూద్దామని ఎదురుచూసిన వేలాది మంది ఫ్యాన్స్​కి తీవ్ర నిరాశ ఎదురైంది! సాల్ట్​ లేక్​లోని ఓ​ స్టేడియంలో ఈవెంట్​ ఏర్పాటు చేయగా, మెస్సీ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు! ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్​ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు.

1 / 5
<p>3 రోజుల పర్యటనలో భాగంగా మెస్సీ ప్రస్తుతం కోల్​కతాలో ఉన్నారు. సాల్ట్​ లేక్​లోని యుభ భారతి క్రిరంగన్​ స్టేడియంలో మెస్సీ ఓ ఫ్రెండ్లీ మ్యాచ్​ ఆడాల్సి ఉందని సమాచారం. అంతేకాదు స్టేడియం చుట్టూ తిరిగి ఫ్యాన్స్​ కోసం ‘ల్యాప్​’ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం భారీ ఎత్తున, భారీ ధరకు టికెట్లు కూడా విక్రయించారు. మెస్సీని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో స్టేడియంకు తరలివెళ్లారు.</p>(HT_PRINT) expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 01:14 pm IST

3 రోజుల పర్యటనలో భాగంగా మెస్సీ ప్రస్తుతం కోల్​కతాలో ఉన్నారు. సాల్ట్​ లేక్​లోని యుభ భారతి క్రిరంగన్​ స్టేడియంలో మెస్సీ ఓ ఫ్రెండ్లీ మ్యాచ్​ ఆడాల్సి ఉందని సమాచారం. అంతేకాదు స్టేడియం చుట్టూ తిరిగి ఫ్యాన్స్​ కోసం ‘ల్యాప్​’ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం భారీ ఎత్తున, భారీ ధరకు టికెట్లు కూడా విక్రయించారు. మెస్సీని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో స్టేడియంకు తరలివెళ్లారు.

(HT_PRINT)

2 / 5
<p>మెస్సీ ఉదయం 11:30లకు స్టేడియం లోపలికి వచ్చారు. ఆ వెంటనే ఆర్గనైజర్స్​, పలువురు రాజకీయ నేతలు, ఫుట్​బాల్​ ప్లేయర్లు, ప్రముఖులు ఆయన్ని చుట్టుముట్టారు. మెస్సీ చుట్టుపక్కన చాలా మంది గుమిగూడటంతో ఆర్గనైజర్స్​లో భద్రతపై ఆందోళన మొదలైంది. వాళ్లని పంపించేందుకు ప్రయత్నించారు. కానీ పంపించలేకపోయారు. స్టేడియం సీట్లల్లో కూర్చున్న వారికి అసలు మెస్సీ ఎక్కడున్నారో కూడా కనిపించలేదు! ఈ గందరగోళం మధ్య, స్టేడియంలో ఎక్కువసేపు ఉండాల్సిన మెస్సీ.. కొద్దసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 01:14 pm IST

మెస్సీ ఉదయం 11:30లకు స్టేడియం లోపలికి వచ్చారు. ఆ వెంటనే ఆర్గనైజర్స్​, పలువురు రాజకీయ నేతలు, ఫుట్​బాల్​ ప్లేయర్లు, ప్రముఖులు ఆయన్ని చుట్టుముట్టారు. మెస్సీ చుట్టుపక్కన చాలా మంది గుమిగూడటంతో ఆర్గనైజర్స్​లో భద్రతపై ఆందోళన మొదలైంది. వాళ్లని పంపించేందుకు ప్రయత్నించారు. కానీ పంపించలేకపోయారు. స్టేడియం సీట్లల్లో కూర్చున్న వారికి అసలు మెస్సీ ఎక్కడున్నారో కూడా కనిపించలేదు! ఈ గందరగోళం మధ్య, స్టేడియంలో ఎక్కువసేపు ఉండాల్సిన మెస్సీ.. కొద్దసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

3 / 5
<p>రూ.12వేలు పెట్టి టికెట్​ కొన్న ఓ వ్యక్తి.. మెస్సీని కనీసం ఒక్క క్షణం కూడా సరిగ్గా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రముఖులే చూసేడట్టు అయితే తమకు టికెట్లు ఎందుకు అమ్మడం అని ప్రశ్నించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 01:14 pm IST

రూ.12వేలు పెట్టి టికెట్​ కొన్న ఓ వ్యక్తి.. మెస్సీని కనీసం ఒక్క క్షణం కూడా సరిగ్గా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు, ప్రముఖులే చూసేడట్టు అయితే తమకు టికెట్లు ఎందుకు అమ్మడం అని ప్రశ్నించారు.

4 / 5
<p>మెస్సీ వెళ్లిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్​లో కోపం తీవ్ర స్థాయికి చేరింది. తమ చేతుల్లో ఉన్న బాటిళ్లను విసికొట్టారు. చాలా మంది పై నుంచి కుర్చూలు కూడా కిందకి విసిరేశారు. ఫలితంగా మైదాన ప్రాంతంలో చెత్త పేరుకుపోయింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 01:14 pm IST

మెస్సీ వెళ్లిపోయాడన్న విషయం తెలిసిన తర్వాత ఫ్యాన్స్​లో కోపం తీవ్ర స్థాయికి చేరింది. తమ చేతుల్లో ఉన్న బాటిళ్లను విసికొట్టారు. చాలా మంది పై నుంచి కుర్చూలు కూడా కిందకి విసిరేశారు. ఫలితంగా మైదాన ప్రాంతంలో చెత్త పేరుకుపోయింది.

5 / 5
<p>కొందరు అసంతృప్తితో స్టేడియం నుంచి వెళ్లిపోయారు. కానీ చాలా మంది బ్యారికెడ్లు దాటుకుని మైదాన ప్రాంతం లోపలికి చొచ్చుకొచ్చారు. టెంట్లు పీకేశారు. దొరికినది పట్టుకుని విరగొట్టారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 13, 2025 01:14 pm IST

కొందరు అసంతృప్తితో స్టేడియం నుంచి వెళ్లిపోయారు. కానీ చాలా మంది బ్యారికెడ్లు దాటుకుని మైదాన ప్రాంతం లోపలికి చొచ్చుకొచ్చారు. టెంట్లు పీకేశారు. దొరికినది పట్టుకుని విరగొట్టారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!