‘నిజామాబాద్ రైల్వే స్టేషన్’ లుక్ మారుతోంది - ఈ ఫొటోలు చూడండి
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని నిజామాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటివరకు 64 శాతం పనులు పూర్తయ్యాయి. తాజా ఫొటోలు ఇక్కడ చూడండి…..
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ అధునాతనంగా అభివృద్ది చేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలోని నిజామాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి.
రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను భారత రైల్వే చేపడుతోంది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది.
ఇందులో భాగంగానే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను చేపట్టారు. రైల్వేశాఖ రూపొందించిన డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా విడుదల వివరాల ప్రకారం… ఇప్పటివరకు 64 శాతం పనులు పూర్తయ్యాయి. కీలమైన పనులు కంప్లీట్ అయ్యాయి. త్వరలో నే అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించనుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఫొటోలు కూడా షేర్ చేశారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ను రూ.53.03 కోట్ల అంచనా వ్యయంతో రీడెవలప్ మెంట్ పనులు కొనసాగుతున్నాయి. సరికొత్త హంగులతో ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నారు.
పార్శిల్ ఆఫీస్, టాయిలెట్స్, 2&4 వీలర్ పార్కింగ్,ఫ్లాట్ ఫామ్ వర్క్స్, ల్యాండ్ స్కేప్ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కొనసాగుతున్నాయి.
అమృత్ భారత్ పథకంలో భాగంగా అత్యాధునిక సౌకర్యాలతో తెలంగాణలో పునరాభివృద్ధి జరుగుతున్న 40 రైల్వే స్టేషన్లలో ఈ స్టేషన్ కూడా ఒకటిగా ఉంది. ఇందులో భాగంగానే ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా స్టేషన్లలో పనులు పూర్తి కాగా… మరికొన్నిచోట్ల తుది దశకు చేరుకుంటున్నాయి.
E-Paper

