'నల్గొండ రైల్వే స్టేషన్' లుక్ మారుతోంది..! ఈ కొత్త ఫొటోలు చూడండి
తెలంగాణలోని నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారిపోతున్నాయి. ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ కింద అభివృద్ధి పనులను చేపట్టారు. 80 శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించిన తాజా ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు.
ప్రయాణికులకు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారతీయ రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని నల్గొండ రైల్వే స్టేషన్ ను ఆధునీకరిస్తోంది.
ఆధునీకరణ పనులతో నల్గొండ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. రూ.17 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 80 శాతం పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆయన తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కవర్ ఓవర్ ఫ్లాట్ ఫామ్స్, లిఫ్ట్స్, అప్రోచ్ రోడ్డు, పార్కింగ్ తో పాటు ఇతర పనులు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి.
ప్లాట్ఫాంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ప్రయాణికులు కూర్చునేందుకు స్టేషన్లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్ బుకింగ్ కేంద్రాన్ని కొత్తగా తీర్చిదిద్దారు.
రైల్వే స్టేషన్ ముందు భాగంలో వెహికల్స్ పార్క్ చేసుకునేందుకు ప్రత్యేక పార్కింగ్ స్థలం సిద్ధం చేశారు.
రైల్వే స్టేషన్ నుంచి ప్లాట్ఫాంపైకి చేరుకునేందుకు అధునాతన లిఫ్టు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. కొత్త టాయిలెట్లు, వెయిటింగ్ హాల్ ను నిర్మించారు.
ప్రయాణికుల కోసం స్టేషన్లో విశాలమైన ఆవరణతో పాటు టికెట్ బుకింగ్ కేంద్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు.
మిగతా 20 శాతం పనులను కూడా త్వరలోనే పూర్తి చేయనున్నారు. ఆ దిశగానే పనులు కొనసాగుతున్నాయి.
E-Paper

